NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు: 107 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధం
    తదుపరి వార్తా కథనం
    ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు: 107 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధం
    ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు: 107 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధం

    ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు: 107 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధం

    వ్రాసిన వారు Stalin
    Mar 07, 2023
    09:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్‌లో గత కొన్ని నెలలుగా అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉత్తరాఖండ్‌లో 107 హెక్టార్లకు పైగా అటవీ విస్తీర్ణం కార్చిచ్చు వల్ల దగ్ధమైనట్లు రాష్ట్ర అటవీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గర్హ్వాల్ ప్రాంతంలో 40.68 హెక్టార్లు, కుమావోన్ ప్రాంతంలో 35.55 హెక్టార్ల విస్తీర్ణం దగ్ధమైనట్లు తెలుస్తోంది.

    31.02 హెక్టార్ల విస్తీర్ణంలోని వన్యప్రాణులు రక్షిత అటవీ ప్రాంతంలో మంటలు సంభవించాయి.

    అడవి మంటల కారణంగా రూ.4,80,000 నష్టం వాటిల్లినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. గర్వాల్‌లో రూ. 3.66 లక్షలు, కుమావోన్‌లో రూ. 1 లక్షకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

    ఉత్తరాఖండ్

    ఈ ఏడాది ఇప్పటికే 40సార్లు మంటలు

    గర్హ్వాల్, కుమావోన్ ప్రాంతాల్లో ఈ సంవత్సరం 40సార్లు మంటలు సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో వన్యప్రాణులు డజనుకు పైగా మరణించినట్లు అటవీశాఖ డేటా వెల్లడించింది.

    ఫిబ్రవరిలో నమోదైన అధిక ఉష్ణోగ్రత కారణంగానే అగ్ని ప్రమాదాలు పెరిగాయి. సాధారణంగా, ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చులు ఫిబ్రవరి మధ్యలో ప్రారంభమవుతాయి. జూన్ మధ్యలో రుతుపవనాలు ప్రారంభమయ్యే వరకు ఉంటాయి. నేలపై ఎండు ఆకులు పుష్కలంగా ఉండటంతో ఉష్ణోగ్రత పెరగడం వల్ల మంటలు వ్యాప్తిస్తాయి.

    అయితే ఈ కార్చిచ్చు వల్ల సమీపంలోని గ్రామస్తులకు, అటవీశాఖ సిబ్బందికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అటవీశాఖ నివేదిక చెబుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఉత్తరాఖండ్

    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు భారతదేశం
    జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి ఇస్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025