NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో నూతన ఇంధన పాలసీ సిద్ధం!.. రాబోయే ఐదేళ్లలో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో నూతన ఇంధన పాలసీ సిద్ధం!.. రాబోయే ఐదేళ్లలో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు
    ఆంధ్రప్రదేశ్ లో నూతన ఇంధన పాలసీ సిద్ధం

    Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో నూతన ఇంధన పాలసీ సిద్ధం!.. రాబోయే ఐదేళ్లలో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 30, 2024
    10:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.75 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 'సమీకృత ఇంధన పాలసీ' (IEP)ని రూపొందించింది.

    ఇందులో సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రోలైజర్స్, బయోఫ్యూయల్, పీఎస్‌పీ, హైబ్రిడ్ ప్రాజెక్టులు, సోలార్ పార్కులు, తయారీ యూనిట్లు ఒకే పాలసీలో భాగంగా ప్రోత్సహించబడతాయి.

    ఈ పాలసీ ద్వారా వచ్చే పెట్టుబడులకు పారిశ్రామిక హోదా కల్పించడం జరుగుతుంది.

    ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం పాలసీ లక్ష్యంగా ఉంది.

    ఇందులో గ్రీన్ హైడ్రోజన్,గ్రీన్ అమ్మోనియా,ఎలక్ట్రోలైజర్ తయారీ,బయోఫ్యూయల్,బ్యాటరీ స్టోరేజ్, పీఎస్పీ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు ఉంటాయి.

    వివరాలు 

    పునరుత్పాదక తయారీ జోన్‌ల ఏర్పాటు

    రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వనరులను విస్తరించి, విద్యుత్ సేకరణ ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త పాలసీని సిద్ధం చేసింది.

    అలాగే, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, పెట్టుబడి అవకాశాలను సృష్టించడం, ఉపాధి అవకాశాలను పెంచడమే ప్రధాన లక్ష్యాలు.

    రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వనరులను విస్తరించి, విద్యుత్ సేకరణ ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త పాలసీని సిద్ధం చేసింది.

    అలాగే, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, పెట్టుబడి అవకాశాలను సృష్టించడం, ఉపాధి అవకాశాలను పెంచడమే ప్రధాన లక్ష్యాలు.

    ప్రభుత్వం పునరుత్పాదక తయారీ జోన్‌లు (REEMZ)ని ఏర్పాటు చేసి, ఆర్‌ఈ టెక్నాలజీలకు ప్రాధాన్యాన్ని ఇచ్చింది.

    సౌర, విండ్‌, హైడ్రోజన్ ప్రాజెక్టులకు రాయితీలు, భూమి లీజు సదుపాయాలు, ఎఫ్‌సీఐలో పెట్టుబడులు, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి.

    వివరాలు 

    రాష్ట్రంలో 500 ఛార్జింగ్‌ కేంద్రాలు 

    గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లలో మౌలిక సదుపాయాలకు కేంద్రం ఇచ్చే సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది. పునరుత్పాదక ప్రాజెక్టుల నిర్వహణ కోసం నోడ్ ఏజెన్సీగా నెడ్‌క్యాప్‌ వ్యవహరిస్తుంది.

    రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    ఈ లక్ష్యంతో, రాబోయే ఐదేళ్లలో 500 ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. ఈ కేంద్రాల ఏర్పాటుకు 25% పెట్టుబడి రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది.

    కార్పొరేషన్లు, జిల్లాకేంద్రాల్లో 150 కేంద్రాలు, జాతీయరహదారుల వెంబడి 150 కేంద్రాలు, మిగిలిన కేంద్రాలను ప్రైవేటు భవనాల్లో ఏర్పాటుచేయాలని ప్రణాళిక వేయింది.

    ఏపీఈఆర్‌సీ నిర్ణయించిన గరిష్ట సీలింగ్ టారిఫ్ (ఎంసీటీ) అమలు చేయనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    ఆంధ్రప్రదేశ్

    AP Rains: ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర..పొంగిన వాగులు… నిలిచిన రాకపోకలు! భారీ వర్షాలు
    Andhrapradesh: ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. జలాశయాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం భారతదేశం
    Palla Srinivas: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    Visvesvara Raja: పాడేరు ఎమ్మెల్యే వీరత్వం.. వరదలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన విశ్వేశ్వరరాజు అల్లూరి సీతారామరాజు జిల్లా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025