NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Indian Migrants: అమెరికా డిపోర్టేషన్‌లో భాగంగా మరికొందరు భారతీయులు.. అమృత్‌సర్‌కు చేరుకోనున్న విమానం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Indian Migrants: అమెరికా డిపోర్టేషన్‌లో భాగంగా మరికొందరు భారతీయులు.. అమృత్‌సర్‌కు చేరుకోనున్న విమానం 
    అమెరికా డిపోర్టేషన్‌లో భాగంగా మరికొందరు భారతీయులు.. అమృత్‌సర్‌కు చేరుకోనున్న విమానం

    Indian Migrants: అమెరికా డిపోర్టేషన్‌లో భాగంగా మరికొందరు భారతీయులు.. అమృత్‌సర్‌కు చేరుకోనున్న విమానం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 15, 2025
    08:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో అక్రమంగా నివసిస్తున్న 119 మంది భారతీయులను తీసుకుని ఒక అమెరికా సైనిక విమానం ఈ రాత్రి అమృత్‌సర్‌కు చేరుకోనుంది.

    శుక్రవారం ఈ సమాచారాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గత నెలలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతదేశానికి బహిష్కరించబడుతున్న రెండవ బ్యాచ్ ఇది.

    ఈ నెల ప్రారంభంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 104 మంది అక్రమ వలసదారులతో అమెరికా సైనిక విమానం అమృత్‌సర్ చేరుకుంది.

    అక్రమ వలసదారులపై కఠిన చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం ఈ భారతీయులను తిరిగి పంపింది.

    వివరాలు 

    మొదటి విడతలో 104 మంది వలసదారులు

    ఈరోజు అక్రమ భారతీయ వలసదారులతో నిండిన మరో విమానం అమృత్‌సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందని వర్గాలు తెలిపాయి.

    అంతకుముందు వచ్చిన విమానంలో 104 మంది వలసదారులు ఉండగా, అది కూడా అమృత్‌సర్‌లోనే ల్యాండ్ అయింది.

    ఈ వలసదారుల్లో అధిక శాతం పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు చెందినవారే.

    ఈ ఘటనపై పార్లమెంటులో తీవ్ర చర్చ జరిగింది. ప్రతిపక్షం, అక్రమ వలసదారులను సంకెళ్లతో కట్టివేసిపంపించారని ఆరోపించగా, దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చాల్సి వచ్చింది.

    ఇది కొత్త పరిణామం కాదని, గతంలో కూడా ఇలాంటివి జరిగాయని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో స్పష్టం చేశారు.

    అమెరికా గతంలో కూడా అక్రమ వలసదారులను బహిష్కరించిన దాఖలాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

    వివరాలు 

    అక్రమ వలసదారులపై ప్రధాని మోదీ ఏమన్నారు? 

    అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అంగీకరిస్తుందని ప్రకటించారు.

    అక్రమ వలసదారుల సమస్య కేవలం భారతదేశానికే పరిమితం కాదని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యగా అభివర్ణించారు.

    ఇతర దేశాల్లో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న వ్యక్తులకు అక్కడ ఉండటానికి హక్కు లేదని అన్నారు.

    భారతదేశం, అమెరికా మధ్య ఒప్పందాల ప్రకారం, ఒక వ్యక్తి భారతీయ పౌరుడని ధృవీకరించబడితే, అతను అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లయితే, భారతదేశం అతన్ని తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    అమెరికా

    Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు అమెరికా అభినందనలు భారతదేశం
    Donald Trump:వేరే ఆప్షన్ లేదు.. 90 వేల మందిని పంపిస్తామని ట్రంప్ ప్రకటన  డొనాల్డ్ ట్రంప్
    US Deportation: అమెరికా డిపార్టేషన్‌ ప్రక్రియపై మండిపడ్డ కొలంబియా, బ్రెజిల్‌ కొలంబియా
    Iron Dome: ఐరన్‌ డోమ్‌ తయారీకి అమెరికా సిద్ధం.. ట్రంప్‌ ప్రకటన డొనాల్డ్ ట్రంప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025