NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi Nomination: ప్రధాని మోదీ నామినేషన్‌కు 12 మంది సీఎంలు 
    తదుపరి వార్తా కథనం
    PM Modi Nomination: ప్రధాని మోదీ నామినేషన్‌కు 12 మంది సీఎంలు 
    PM Modi Nomination: ప్రధాని మోదీ నామినేషన్‌కు 12 మంది సీఎంలు

    PM Modi Nomination: ప్రధాని మోదీ నామినేషన్‌కు 12 మంది సీఎంలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 14, 2024
    09:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి నామినేషన్‌ దాఖలు చేస్తున్నారు.

    ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. అందులో భాగంగా.. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దగ్గరుండి పర్యవేక్షించారు.

    కాగా, ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి 12 మంది ముఖ్యమంత్రులు హాజరవుతారని బీజేపీ నేత ఒకరు తెలిపారు.

    అంతేకాకుండా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ ఎన్డీయే మిత్రపక్షాల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.

    Details 

    ప్రధాని నామినేషన్‌కు వచ్చేవారు వీరే..

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నామినేషన్‌కు హాజరయ్యే అవకాశం ఉంది.

    రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్‌ సింగ్‌ సైనీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా కూడా అక్కడ ఉంటారని వారు తెలిపారు.

    Details 

    నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్

    రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్ జయంత్ చౌదరి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, అప్నాదళ్ (ఎస్) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్‌భర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్‌కు హాజరుకానున్నారు.

    నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు, ప్రధానమంత్రి దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగాదేవికి పూజలు చేస్తారు.

    అలాగే, ప్రధాని మోదీ నమో ఘాట్‌ను కూడా సందర్శిస్తారు. అక్కడి నుంచి బాబా కాలభైరవ ఆలయానికి వెళ్లి పూజలు చేయనున్నారు.

    అనంతరం ప్రధాని నామినేషన్‌ దాఖలు చేసేందుకు కలెక్టరేట్‌కు వెళ్లనున్నారు. అనంతరం కన్వెన్షన్ సెంటర్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నరేంద్ర మోదీ

    PM Modi: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే: ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్
    Narendra Modi : 'రాహుల్ గాంధీకి సవాలుకు నేను రెడీ' .. జగిత్యాలలో ఎన్నికల సభలో మోదీ  భారతదేశం
    PM Modi: భూటాన్‌ వెళ్లనున్న ప్రధాని మోదీ  భూటాన్
    Narendra Modi: లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని మోడీకి రష్యా, ఉక్రెయిన్ దేశాధ్యక్షులు ఆహ్వానం  జెలెన్‌స్కీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025