Page Loader
J&K: జమ్ముకశ్మీర్'లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి.. ఇద్దరు సైనికులకు గాయలు 
జమ్ముకశ్మీర్'లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి

J&K: జమ్ముకశ్మీర్'లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి.. ఇద్దరు సైనికులకు గాయలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2024
08:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ)కి సమీపంలోని గుల్‌మార్గ్‌లోని బోటాపాత్ర్‌లోని నాగిన్ ప్రాంతం సమీపంలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. వాహనం 18 రాష్ట్రీయ రైఫిల్స్(RR)కి చెందినది.ఉగ్రవాదులు దాడికి దిగిన సమయంలో వాహనం బోటపాత్ర్ నుంచి వెళ్తోంది. ఈ దాడిలో ఓ పోర్టర్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి.ఇటీవల కాశ్మీర్‌లో స్థానికేతర కార్మికులపై దాడి పెరిగింది, తాజా దాడి గురువారం ఉదయం జరిగింది. ఈరోజు పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓకూలీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి గాయపరిచారు. ఆదివారం గందర్‌బాల్ జిల్లాలోని నిర్మాణ స్థలంపై జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు స్థానికేతర కార్మికులు,స్థానిక వైద్యుడు మరణించగా,బిహార్‌కు చెందిన ఒక కార్మికుడు అక్టోబర్ 18న షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గుల్‌మార్గ్‌లో ఆర్మీ వాహనంపై దాడి