NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttar Pradesh: పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు హతం! 
    తదుపరి వార్తా కథనం
    Uttar Pradesh: పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు హతం! 
    పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు హతం!

    Uttar Pradesh: పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు హతం! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 23, 2024
    09:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లో సోమవారం తెల్లవారుజామున ఒక పెద్ద ఎన్‌కౌంటర్ జరిగింది.

    ఈ ఘటనలో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు యూపీ పోలీసులతో జరిగిన కాల్పులలో మరణించారు.

    వారు అనుమానాస్పద వస్తువులతో పురానాపుర్ ప్రాంతంలో తిరుగుతున్నట్లు సమాచారం అందుకున్నట్లు పోలీసుల వెల్లడించారు.

    ఈ సమయంలో, ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

    ఈ ఉగ్రవాదులు పంజాబ్ సరిహద్దుల్లోని పోలీసు పోస్టులపై గ్రనేడ్ దాడులకు పాల్పడిన నిందితులుగా గుర్తించబడ్డారు.

    ఇటీవల, వారి ఆచూకీ యూపీ రాష్ట్రంలోని పీలీభీత్ జిల్లాలో కనుగొనబడింది, దీంతో యూపీ, పంజాబ్ పోలీసులు అప్రమత్తమై, సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.

    వివరాలు 

    ఏకే రైఫిల్స్, పిస్టళ్లు స్వాధీనం

    పురానాపుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన సమయంలో కాల్పులు జరగడంతో ఎన్‌కౌంటర్ జరిగింది.

    ఈ కాల్పుల్లో గాయపడిన నిందితులు గుర్వీందర్ సింగ్, వీరేంద్ర సింగ్, జసన్‌ప్రీత్ సింగ్‌లను ఆసుపత్రికి తరలించి చికిత్స ఇచ్చారు, కానీ చికిత్స పొందుతూ వారు మృతిచెందారని పంజాబ్ డీజీపీ వెల్లడించారు.

    నిందితుల వద్ద నుండి ఏకే రైఫిల్స్, పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

    ఈ ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్తాన్ మద్దతు పొందిన ఖలిస్థానీ జిందాబాద్ ఫోర్స్‌ సభ్యులని పంజాబ్ పోలీసులు తెలియజేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఉత్తర్‌ప్రదేశ్

    Uttar Pradesh : యూపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం.. రెండుగా విడిపోయిన కిసాన్ ఎక్స్‌ప్రెస్ ఇండియా
    Uttar Pradesh: యూపీలో గ్యాంగ్ రేప్.. ఇద్దరి విద్యార్థినులను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం  అత్యాచారం
    Lucknow: లక్నోలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో  ఐజీ కుమార్తె మృతి  లక్నో
    Operation Bhediya: ఉత్తర్‌ప్రదేశ్'లో కొనసాగుతున్న తోడేళ్ళ భీభత్సం.. అటవీశాఖ పెట్రోలింగ్ ఉన్నప్పటికీ బాలిక మృతి  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025