NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ICAI CA Final Results: సీఏ ఫైనల్‌ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు.. ఇద్దరికీ ఫస్ట్‌ ర్యాంక్‌
    తదుపరి వార్తా కథనం
    ICAI CA Final Results: సీఏ ఫైనల్‌ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు.. ఇద్దరికీ ఫస్ట్‌ ర్యాంక్‌
    సీఏ ఫైనల్‌ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు.. ఇద్దరికీ ఫస్ట్‌ ర్యాంక్‌

    ICAI CA Final Results: సీఏ ఫైనల్‌ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు.. ఇద్దరికీ ఫస్ట్‌ ర్యాంక్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 27, 2024
    04:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియా చార్టెడ్ అకౌంటెంట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ICAI) సీఏ తుది పరీక్షల ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన చూపించారు.

    హైదరాబాద్‌,తిరుపతికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకును సాధించారు.

    నవంబర్‌లో నిర్వహించిన సీఏ తుది పరీక్షల ఫలితాలను ICAI గురువారం అర్ధరాత్రి విడుదల చేసింది.

    విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్లు ద్వారా స్కోరు కార్డులు, మెరిట్‌ జాబితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

    వివరాలు 

    508 మార్కులతో (84.67%) అగ్రర్యాంకు

    సీఏ తుది పరీక్షలో గ్రూప్‌-1 విభాగంలో ఉత్తీర్ణత శాతం 16.8%, గ్రూప్‌-2లో 21.36% నమోదయ్యాయి.

    రెండు గ్రూపుల్లో కలిపి 13.44% ఉత్తీర్ణత సాధించబడినట్లు ICAI ఒక ప్రకటనలో తెలిపింది.

    ఈ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన హేరంబ్‌ మహేశ్వరి, తిరుపతికి చెందిన రిషబ్‌ ఓస్త్వాల్‌ ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకులో నిలిచారు.

    వారు ఇద్దరూ 508 మార్కులతో (84.67%) అగ్రర్యాంకును సాధించారు.

    అలాగే, అహ్మదాబాద్‌కు చెందిన రియా కుంజన్‌కుమార్‌ షా 501 మార్కులతో రెండో ర్యాంకు, కోల్‌కత్తాకు చెందిన కింజాల్‌ అజ్మేరా 493 మార్కులతో మూడో ర్యాంకు సాధించినట్లు ICAI వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    భారతదేశం

    India-Canada: నిజ్జర్‌ హత్య కేసు.. బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో కలిసి భారత్‌ కుట్ర?.. కెనడా తీవ్ర ఆరోపణలు  కెనడా
    India-Canada: కెనడా, భారత్ సంబంధాలు.. ఆంక్షల దిశగా అడుగులు! కెనడా
    India-Canada: అగ్ర దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్,కెనడా..ఇరుదేశాల మధ్య క్షిణిస్తున్న సంబంధాలు..ఈ వివాదంలో ఏమి జరుగబోతోంది  కెనడా
    Cancer: 2045 నాటికి భారతదేశంలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతాయి: ICMR క్యాన్సర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025