NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / JPC Members: జమిలి బిల్లుపై 48 గంటల గడువు.. జేపీసీ ఏర్పాటుకు స్పీకర్ ముందడుగు
    తదుపరి వార్తా కథనం
    JPC Members: జమిలి బిల్లుపై 48 గంటల గడువు.. జేపీసీ ఏర్పాటుకు స్పీకర్ ముందడుగు
    జమిలి బిల్లుపై 48 గంటల గడువు.. జేపీసీ ఏర్పాటుకు స్పీకర్ ముందడుగు

    JPC Members: జమిలి బిల్లుపై 48 గంటల గడువు.. జేపీసీ ఏర్పాటుకు స్పీకర్ ముందడుగు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 18, 2024
    09:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమిలి ఎన్నికల బిల్లులపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలు, తీర్మానంపై ఓటింగ్ కేంద్ర ప్రభుత్వానికి సాధారణ మెజారిటీని అందించాయి.

    అయితే ఈ బిల్లులు రాజ్యాంగ సవరణ బిల్లులుగా ఉండటంతో వాటి ఆమోదానికి 3/2 మెజారిటీ అవసరం.

    ఈ నేపథ్యంలో బిల్లుపై మరింత సమగ్ర చర్చలు జరపాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించనున్నట్లు ప్రకటించింది.

    జేపీసీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా పర్యవేక్షించనున్నారు. స్పీకర్‌ రాబోయే 48 గంటల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

    ఎందుకంటే శుక్రవారంతో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈలోగా జేపీసీ సభ్యులను ప్రకటించకపోతే, జమిలి ఎన్నికల బిల్లులను తిరిగి లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి రావచ్చు.

    Details

    90 రోజుల గడువు అవసరం

    జేపీసీలో గరిష్ఠంగా 31 మంది సభ్యులు ఉంటారు. వారిలో 21 మంది ఎంపీలను లోక్‌సభ నుంచి, 10 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి నియమించనున్నారు.

    ప్రధాన పార్టీలకు చెందిన ఎంపీల పేర్లను అందించాలని లోక్‌సభ స్పీకర్ కార్యాలయం ఇప్పటికే సూచించింది. స్పీకర్ సభ్యుల ప్రకటన త్వరగా చేయాల్సిన అవసరం ఉంది.

    తద్వారా బిల్లుపై చర్చలు ముందుకు సాగతాయి. జేపీసీ బిల్లుపై సమగ్ర చర్చలు పూర్తి చేయడానికి సాధారణంగా 90 రోజుల గడువు కల్పిస్తారు.

    అవసరమైతే ఈ గడువును పొడిగించే వీలుంది. ఈ కమిటీ చర్చల అనంతరం బిల్లుపై తుది నివేదికను సమర్పిస్తుంది.

    Details

    బిల్లు కొత్తగా ప్రవేశపెట్టే ఛాన్స్

    తద్వారా లోక్‌సభ, రాజ్యసభలు మరింత స్పష్టతతో నిర్ణయం తీసుకోవచ్చు.

    జమిలి ఎన్నికల బిల్లుపై చర్చలకు జేపీసీ అత్యంత ప్రాధాన్యంగా మారింది.

    పార్లమెంట్‌లో ప్రధాన పార్టీలు తమ ప్రతినిధుల ఎంపికలో వేగంగా వ్యవహరిస్తేనే బిల్లుపై చర్చలు సమయానికి ప్రారంభమవుతాయి.

    ఒకవేళ ప్రక్రియ ఆలస్యం అయితే, బిల్లును కొత్తగా ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమిలి ఎన్నికలు
    లోక్‌సభ
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    జమిలి ఎన్నికలు

    One nation, one election: జమిలి ఎన్నికల కోసం 8మందితో కేంద్రం కమిటీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ  అసెంబ్లీ ఎన్నికలు
    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    One Nation, One Election: జమిలి ఎన్నికల ఆలోచనపై రాహుల్ గాంధీ ఫైర్  రాహుల్ గాంధీ
    ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు  నరేంద్ర మోదీ

    లోక్‌సభ

    Lok Sabha Election Dates: గురు లేదా శుక్రవారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్  ఎన్నికల సంఘం
    Arun Goel: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా ఎన్నికల సంఘం
    TMC candidates: పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ పశ్చిమ బెంగాల్
    Bishnupur seat: ఒకే లోక్‌సభ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ  పశ్చిమ బెంగాల్

    కేంద్ర ప్రభుత్వం

    PM E-DRIVE: పీఎం ఇ- డ్రైవ్‌ పథకం ద్వారా టూ వీలర్‌కు గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ దిల్లీ
    Amit Shah: మావోయిస్టుల నిర్మూలనకు కృషి.. సరికొత్త వ్యూహాలను రచిస్తోన్న కేంద్రం అమిత్ షా
    Ministry of Ayush: అద్భుత ఫలితాలంటూ ఆయుర్వేద, సిద్ధ ఔషధాలను ప్రచారం చేయడం చట్టవిరుద్ధం టెక్నాలజీ
    Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ₹ 2,348 కోట్లు.. అడ్వాన్సుగా విడుదల..కేంద్ర జల శక్తి శాఖ షరతులు పోలవరం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025