NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kailash Manasarovar Yatra: ఐదు సంవత్సరాల విరామం అనంతరం.. 720 మందితో మళ్లీ ప్రారంభం కానున్న కైలాస మానస సరోవర యాత్ర 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Kailash Manasarovar Yatra: ఐదు సంవత్సరాల విరామం అనంతరం.. 720 మందితో మళ్లీ ప్రారంభం కానున్న కైలాస మానస సరోవర యాత్ర 
    ఐదు సంవత్సరాల విరామం అనంతరం.. 720 మందితో కైలాస మానస సరోవర యాత్ర

    Kailash Manasarovar Yatra: ఐదు సంవత్సరాల విరామం అనంతరం.. 720 మందితో మళ్లీ ప్రారంభం కానున్న కైలాస మానస సరోవర యాత్ర 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 21, 2025
    03:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐదేళ్ల విరామం తర్వాత కైలాస మానస సరోవర యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. ఈసారి మొత్తం 720 మంది భక్తులు ఈ పుణ్యయాత్రలో పాల్గొననున్నారు.

    వీరితో పాటు 30 మంది లైజన్ అధికారులు కూడా ఉండనున్నారని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

    యాత్రికుల ఎంపికకు లక్కీ డ్రా విధానాన్ని అనుసరించారు. కంప్యూటర్ ద్వారా ర్యాండ‌మ్‌గా వ్యక్తులను ఎంపిక చేశారు.

    కరోనా మహమ్మారి కారణంగా 2020 నుంచి మానస సరోవర యాత్రను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

    చైనా ప్రభుత్వం నుంచి యాత్రకు సంబంధించి సరైన సమాచారం లేకపోవడం కూడా ఆ నిర్ణయానికి కారణమైంది.

    జూన్ మూడవ వారం నుండి యాత్ర మొదలయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 25వ తేదీతో ఈ యాత్ర ముగియనుంది.

    వివరాలు 

    ఉత్తరాఖండ్ మార్గం ద్వారా ఐదు బ్యాచ్‌లు 

    ఈ యాత్ర రెండు ప్రధాన మార్గాల్లో నిర్వహించనున్నారు. ఉత్తరాఖండ్, సిక్కిం రూట్లలో.

    ఈ రెండు మార్గాల కలిపి మొత్తంగా 720 మందికి మాత్రమే ఈసారి అవకాశం కల్పించారు.

    టిబెట్ ప్రాంతంలో ఉన్న కైలాస పర్వతం,మానస సరోవరానికి భక్తులు చేరుకోనున్న ఈ యాత్ర లో ఉత్తరాఖండ్ మార్గం ద్వారా ఐదు బ్యాచ్‌లను పంపనున్నారు.

    ప్రతి బ్యాచ్‌లో 48 మంది భక్తులు ఉండనున్నారు.అదే విధంగా, సిక్కిం మార్గంలో నాథులా పాస్ ద్వార 10 బ్యాచ్‌లు బయలుదేరనున్నాయి.

    వివరాలు 

    మొత్తం 5384 మంది దరఖాస్తు

    ఒక్కొక్క బ్యాచ్‌లో 48 మంది యాత్రికులు ఉంటారు. ఈ యాత్ర కోసం ఈసారి మొత్తం 5384 మంది దరఖాస్తు చేశారు.

    వీరిలో 3898 మంది పురుషులు కాగా, 1486 మంది మహిళలు ఉన్నారు. అలాగే 65 ఏళ్లు పైబడిన వయోజనులు 404 మంది ఉన్నట్లు సమాచారం.

    హిందువులతో పాటు బౌద్ధులు, జైనులు కూడా ఈ యాత్రను అత్యంత పవిత్రంగా భావిస్తారని విదేశాంగ శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలియజేశారు.

    లిపులేక్ పాస్, నాథులా పాస్ మార్గాల్లో రోడ్లను నిర్మించిన కారణంగా, వృద్ధ యాత్రికులకు ఈసారి ప్రయాణం మరింత సులభమవుతుందని ఆయన వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్
    సిక్కిం

    తాజా

    Jayam Ravi : విడాకుల కేసులో కొత్త మలుపు.. రూ.40 లక్షలు భరణం కోరిన జయం రవి భార్య టాలీవుడ్
    Kailash Manasarovar Yatra: ఐదు సంవత్సరాల విరామం అనంతరం.. 720 మందితో మళ్లీ ప్రారంభం కానున్న కైలాస మానస సరోవర యాత్ర  ఉత్తరాఖండ్
    Hyderabad Rains: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ వాతావరణ శాఖ
    MI vs DC Predicted Playing XI: ప్లేఆఫ్స్ కోసం డూ ఆర్ డై పోరు.. ముంబై-ఢిల్లీ జట్లలో కీలక మార్పులు ముంబయి ఇండియన్స్

    ఉత్తరాఖండ్

    Ram Temple consecration: ఆలయ నిర్మాణం అసంపూర్తి: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి నలుగురు శంకరాచార్యులు దూరం భారతదేశం
    UCC: నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 'యూనిఫాం సివిల్ కోడ్' బిల్లు  యూనిఫాం సివిల్ కోడ్
    UCC: సహజీవనానికి రిజిస్ట్రేషన్ లేకుంటే 6నెలు జైలు శిక్ష.. యూసీసీ బిల్లులో నిబంధనలు ఇవే.. యూనిఫాం సివిల్ కోడ్
    యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం భారతదేశం

    సిక్కిం

    లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. 16మంది భారత జవాన్లు మృతి భారతదేశం
    సిక్కింలో భూకంపం, యుక్సోమ్‌లో 4.3 తీవ్రత నమోదు భూకంపం
    సిక్కింలో భారీ హిమపాతం, ఆరుగురు పర్యాటకులు మృతి; మంచులో చిక్కుకున్న 150మంది భారతదేశం
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025