
Road Accident: పశ్చిమబెంగాల్'లో ఘోర రోడ్డుప్రమాదం.. తొమ్మిది మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
బొలెరో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టిన ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం,ఈ దుర్ఘటన బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నామ్షోల్ సమీపంలోని జాతీయ రహదారి సంఖ్య 18పై చోటు చేసుకుంది.
పురులియా జిల్లాలోని బారాబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల అడబానా గ్రామానికి చెందిన వ్యక్తులు, జార్ఖండ్ రాష్ట్రంలోని నిమ్దిహ్ ప్రాంతంలో తిలైతాండ్ అనే ఊరిలో జరుగుతున్న ఓ వివాహ వేడుకకు హాజరవడానికి బొలెరో వాహనంలో వెళ్లారు.
వివరాలు
పూర్తిగా ధ్వంసమైన బొలెరో వాహనం
వివాహ కార్యక్రమం ముగించుకుని వారు తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన సమయంలో, వారి బొలెరో వాహనం నామ్షోల్ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఎదురెళ్లి ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రతకు బొలెరో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో వాహనంలోని తొమ్మిది మందికి తీవ్రమైన గాయాలు తగలగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కానీ ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే అందరూ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
ప్రస్తుతం పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు ప్రారంభించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పశ్చిమబెంగాల్'లో ఘోర రోడ్డుప్రమాదం
पुरुलिया NH-18 हादसा 💔
— Hindustan Daily News (@hdnewsx) June 20, 2025
बोलेरो-ट्रेलर टक्कर में 9 की मौत।
मृतक: बीरु, अजय, विजय, स्वपन, गुरुपद, शशांक, चित्त, कृष्णा (लाकड़ी, नीमडीह)
चंद्रमोहन (रघुनाथपुर)।
सभी बारात से लौट रहे थे।
गांव में शोक।#Purulia #RoadAccident#Hindustandailynews pic.twitter.com/H2ngle1A7w