NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / KIA: పెనుకొండ కియా పరిశ్రమలో పెద్ద ఎత్తున కారు ఇంజిన్లు మాయం 
    తదుపరి వార్తా కథనం
    KIA: పెనుకొండ కియా పరిశ్రమలో పెద్ద ఎత్తున కారు ఇంజిన్లు మాయం 
    పెనుకొండ కియా పరిశ్రమలో పెద్ద ఎత్తున కారు ఇంజిన్లు మాయం

    KIA: పెనుకొండ కియా పరిశ్రమలో పెద్ద ఎత్తున కారు ఇంజిన్లు మాయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 08, 2025
    10:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండకు చెందిన కియా పరిశ్రమలో అనేక కారు ఇంజిన్లు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    మార్చి 19న, సుమారు 900 ఇంజిన్లు కనిపించకుండా పోయాయని కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    ఇంజిన్‌‌లు మాయమవుతున్న విషయంపై యాజమాన్యం ముందుగా పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయకుండా, ప్రత్యక్షంగా దర్యాప్తు ప్రారంభించాలని కోరింది.

    అయితే, ఫిర్యాదు లేకుండా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని పోలీసులు స్పష్టం చేశారు.

    దాంతో, కియా ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణ కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

    వివరాలు 

     తుదిదశకు కేసు దర్యాప్తు

    కియా సంస్థకు అవసరమైన విడి భాగాలు విభిన్న ప్రాంతాల నుండి సరఫరా అవుతుంటాయి.

    ఇందులో భాగంగా, కారు ఇంజిన్లు తమిళనాడు నుండి వస్తున్నాయి. ఆ మార్గంలో ఎక్కడైనా చోరీ జరిగిందా? లేక పరిశ్రమకు చేరిన తర్వాతే అవి దొంగిలించబడాయా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

    ఇప్పటికే కేసు దర్యాప్తు తుదిదశకు చేరినట్టు సమాచారం. త్వరలో అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీ సత్యసాయి జిల్లా

    తాజా

    Bombs: జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం నాటి మూడు బాంబులు.. 20వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు జర్మనీ
    New Courses: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటర్ లోనే బీటెక్ సబ్జెక్ట్స్ తెలంగాణ
    Hari hara veera mallu: 'హరిహర వీరమల్లు' రెమ్యునేషన్‌ను వెనక్కి ఇచ్చేసిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు
    IND vs PAK: పాక్‌కు ఏడీబీ బ్యాంక్ $800 మిలియన్ల ప్యాకేజీ.. నిధుల విడుదలపై భారత్ అభ్యంతరం.. పాకిస్థాన్

    శ్రీ సత్యసాయి జిల్లా

    ఆంధ్రప్రదేశ్‌: త్వరలోనే అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల పనులు ప్రారంభం- 2028నాటికి పూర్తి చేయడమే లక్ష్యం ఆంధ్రప్రదేశ్
    శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం..భర్త,అతని ప్రియురాలికి పాక్షికంగా గుండు కొట్టించిన భార్య   ఆంధ్రప్రదేశ్
    Sri Sathya Sai: పుట్టపర్తిలో అద్భుత దృశ్యం.. శ్రీ సత్యసాయి మెడలో నాగుపాము   ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh tahsildar: లంచం ఎందుకు తీసుకోవాలో చెప్పిన తహసీల్దారు.. వీడియో వైరల్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025