NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Govt: 93వేల కుటుంబాలకు లబ్ధి.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!
    తదుపరి వార్తా కథనం
    AP Govt: 93వేల కుటుంబాలకు లబ్ధి.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!
    93వేల కుటుంబాలకు లబ్ధి.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!

    AP Govt: 93వేల కుటుంబాలకు లబ్ధి.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 27, 2025
    09:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

    ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తాజాగా చేనేత కార్మికులకు తీపి కబురు అందించారు.

    ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 93 వేల చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

    చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున, పవర్ లూమ్‌లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజా నిర్ణయంతో 93,000 చేనేత కుటుంబాలతో పాటు 10,534 పవర్ లూమ్ యూనిట్లకు ప్రయోజనం కలుగనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

    Details

     పవర్ లూమ్‌లకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటన

    అయితే ఈ పథకం అమలు విధివిధానాలను ఖరారు చేయడానికి ప్రభుత్వం ఇంధన శాఖతో సంప్రదింపులు జరుపనుంది.

    చేనేత వస్త్రాల తయారీని వృత్తిగా చేసుకుంటున్న కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడమే ఈ పథకానికి ముఖ్య ఉద్దేశం.

    ముఖ్యంగా లబ్ధిదారులు అనుమతించిన విద్యుత్ పరిమితిని మించిపోతే, రాయితీ మొత్తం కోల్పోకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిబంధనను తీసుకువచ్చింది.

    200 యూనిట్ల వరకు విద్యుత్ ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. అయితే అదనంగా వినియోగించిన యూనిట్లకు మాత్రం డిస్కంల టారిఫ్ ప్రకారం వినియోగదారులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

    ఇదే నిబంధన పవర్ లూమ్‌లకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్
    విద్యుత్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    చంద్రబాబు నాయుడు

    ChandraBabu: నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవిపై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..? భారతదేశం
    Drone city': చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. ఆంధ్ర ప్రదేశ్ 'డ్రోన్ సిటీ'..  భారతదేశం
    Chandrababu: జాబ్స్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి : చంద్రబాబు ఆంధ్రప్రదేశ్
    Supreme Court: సీఎం చంద్రబాబుపై కేసులు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం  ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: ఏపీలో మరో రెండు గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు.. టెండర్ల ప్రక్రియ ప్రారంభం అమరావతి
    AP-Telangana: తెలంగాణ-ఏపీకి కొత్త కనెక్షన్..  కృష్ణా నదిపై తొలి కేబుల్ బ్రిడ్జి! తెలంగాణ
    Andhra Pradesh: విద్యార్థుల సంచి బరువు తగ్గించేందుకు మంత్రి లోకేశ్‌ చర్యలు.. 1-9 తరగతుల విద్యార్థులకు సెమిస్టర్‌ విధానం భారతదేశం
    Somu Veerraju: నేడు ఎమ్మెల్సీ నామినేషన్.. బీజేపీ నుంచి సోము వీర్రాజుకు అవకాశం బీజేపీ

    విద్యుత్

    కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలంగాణ
    సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025