NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Madhyapradesh Elections: మధ్యప్రదేశ్‌లో నేడు పోలింగ్.. కీలక నియోజకవర్గంలో గెలుపు ఎవరిది?
    తదుపరి వార్తా కథనం
    Madhyapradesh Elections: మధ్యప్రదేశ్‌లో నేడు పోలింగ్.. కీలక నియోజకవర్గంలో గెలుపు ఎవరిది?
    మధ్యప్రదేశ్‌లో నేడు పోలింగ్.. కీలక నియోజకవర్గంలో గెలుపు ఎవరిది?

    Madhyapradesh Elections: మధ్యప్రదేశ్‌లో నేడు పోలింగ్.. కీలక నియోజకవర్గంలో గెలుపు ఎవరిది?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 17, 2023
    08:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఈరోజు జరుగుతుండగా, ప్రధాన పోరు కాంగ్రెస్‌-బీజేపీ మధ్యే నెలకొంది.

    ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ సహా ఇరు పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ నేతలు పోటీలో ఉన్నారు.

    బుద్ని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఆయన పార్టీ బరిలోకి దింపింది. ఆయనపై పోటీకి నటుడు విక్రమ్‌ మస్తాల్‌ను కాంగ్రెస్‌ పోటీకి దింపింది. విక్రమ్‌ (40) 2008 టీవీ సీరియల్ 'రామాయణ్ 2'లో 'హనుమాన్' పాత్రను పోషించారు.

    Details 

    జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు.. ప్రభుత్వంలోకి శివరాజ్ సింగ్ చౌహాన్

    చింద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలో,మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్,చింద్వారా జిల్లా భారతీయ జనతా యువమోర్చా మాజీ అధ్యక్షుడు, బిజెపికి చెందిన వివేక్ బంటీ సాహుపై తన సొంతగడ్డపై పోటీ చేస్తున్నారు.

    కమల్ నాథ్ 2019లో చింద్వారా నుంచి బీజేపీకి చెందిన సాహుపై 25,837 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

    మార్చి 2020లో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చెయ్యడంతో ముఖ్యమంత్రిగా కమల్ నాథ్ పదవీకాలం ముగిసింది.

    అదే సమయంలో మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి అవకాశం ఏర్పడింది.

    Details 

    ఇండోర్-1 లో గెలుపు ఎవరిది?

    మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్ తమ కుటుంబానికి కంచు కోట అయిన రఘోఘర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అదే సమయంలో, జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ శిబిరంలో చేరడంతో పోటీ రసవత్తరంగా మారింది.

    ఇప్పుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న సింధియా, దిగ్విజయ్ సింగ్ బంధువు మూల్ సింగ్ కుమారుడు హీరేంద్ర సింగ్, అలియాస్ బంటి బన్నాను బీజేపీ శిబిరంలోకి రావడానికి ఒప్పించారు. బీజేపీ రఘోఘర్ నుంచి బంటి బన్నాని జైవర్ధన్ సింగ్‌పై పోటీకి దింపారు.

    బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ ఇండోర్-1 నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఇండోర్ మాజీ మేయర్ సంజయ్ శుక్లాను బరిలోకి దింపింది.

    Details 

    పటేల్ సామాజికవర్గం ప్రాబల్యం ఉన్న నర్సింగాపూర్ లో గెలుపు ఎవరిది?

    ఇండోర్-1 నియోజకవర్గం బీజేపీకి కంచుకోట, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఇండోర్-1 నుంచి శుక్లా గెలవడంతో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది.

    నర్సింగపూర్ నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బరిలోకి దిగారు. ఒకే స్థానం నుంచి రెండుసార్లు గెలిచిన ఆయన సోదరుడు జలం సింగ్ పటేల్ స్థానంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

    నర్సింగ్‌పూర్‌లో ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌పై పోటీ చేయడానికి లఖన్‌సింగ్‌ పటేల్‌ను కాంగ్రెస్‌ రంగంలోకి దించింది.

    లఖన్ గతంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన జలం సింగ్ పటేల్ చేతిలో ఓడిపోయారు. పటేల్ సామాజికవర్గం ప్రాబల్యం ఉన్న నర్సింగాపూర్ ఈ ఎన్నికల్లో కేంద్ర బిందువుగా నిలుస్తోంది.

    Details 

    కాంగ్రెస్ కంచుకోట లహర్ లో బీజేపీ అడుగుపెడుతుందా? 

    మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా దతియా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అయిన నరోత్తమ్ మిశ్రా కాంగ్రెస్‌కు చెందిన అవధేష్ నాయక్‌తో పోటీపడుతున్నారు.

    బీజేపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మిశ్రా 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి భారతీ రాజేంద్రపై 72,209 ఓట్లతో విజయం సాధించారు.

    లాహర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గోవింద్ సింగ్‌పై పోటీ చేసేందుకు బీజేపీ అంబరీష్ శర్మను రంగంలోకి దించింది.

    లహర్ నుంచి వరుసగా ఏడు సార్లు విజయం సాధించిన రికార్డు సింగ్‌కు ఉంది. ఈ కాంగ్రెస్ కంచుకోటలో అడుగుపెట్టాలని బీజేపీ భావిస్తోంది.

    రాష్ట్రంలో డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    ఎన్నికలు

    తాజా

    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్
    united nations: గాజాలో రాబోయే 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం: హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి  ఐక్యరాజ్య సమితి
    Jyoti Malhotra: విచారణలో సంచలన నిజాలు.. 'ఐఎస్‌ఐ' ఎరగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా? జ్యోతి మల్హోత్రా

    మధ్యప్రదేశ్

    2019-2021 మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు మిస్సింగ్: కేంద్రం వెల్లడి కేంద్ర ప్రభుత్వం
    కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి.. ఆందోళన రేకెత్తిస్తున్న చీతాల వరుస మరణాలు కునో నేషనల్ పార్క్
    ఇండోర్ నగరంలో అరుదైన శస్త్ర చికిత్స.. మహిళ కడుపులో భారీ కణితి తొలగింపు  ఇండోర్
    మధ్యప్రదేశ్‌లో నేలరాలిన పులి పిల్ల.. బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఆడపులి మృతి  భారతదేశం

    ఎన్నికలు

    అమిత్ షాతో బండి సంజయ్ భేటీ; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ  తెలంగాణ
    పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు.. ఇవాళ రాజీనామా చేయనున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్
    పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ రద్దు.. ప్రధాని షరీఫ్ సూచనతో అధ్యక్షుడు అరీఫ్ నిర్ణయం పాకిస్థాన్
    PM Modi: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు 5 వరాలు నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025