NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'జల్ జీవన్ మిషన్' పూర్తయితే భారత్‌లో 4లక్షల మరణాలను నివారించవచ్చు: డబ్ల్యూహెచ్ఓ 
    తదుపరి వార్తా కథనం
    'జల్ జీవన్ మిషన్' పూర్తయితే భారత్‌లో 4లక్షల మరణాలను నివారించవచ్చు: డబ్ల్యూహెచ్ఓ 
    'జల్ జీవన్ మిషన్' పూర్తయితే భారత్‌లో 4లక్షల మరణాలను నివారించవచ్చు: డబ్ల్యూహెచ్ఓ

    'జల్ జీవన్ మిషన్' పూర్తయితే భారత్‌లో 4లక్షల మరణాలను నివారించవచ్చు: డబ్ల్యూహెచ్ఓ 

    వ్రాసిన వారు Stalin
    Jun 10, 2023
    10:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జల్ జీవన్ మిషన్'పై ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) కీలక అధ్యయనం చేసింది. ఈ మేరకు ఆ నివేదికను వెల్లడించింది.

    'జల్ జీవన్ మిషన్' కార్యక్రమం అన్ని గ్రామీణ గృహాలకు స్వచ్ఛమైన నీటిని అందించాలనే దాని లక్ష్యాన్ని చేరుకుంటే, భారత్‌లో దాదాపు 400k అతిసార వ్యాధి మరణాలను నివారించవచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

    కేంద్రం 2019లో జల్ జీవన్ మిషన్‌ను ప్రారంభించింది. ఇది వచ్చే ఏడాది నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఇళ్లకు వ్యక్తిగత కుళాయి కనెక్షన్‌ల ద్వారా సురక్షితమైన, తగినంత తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్రం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

    తాగునీరు

    నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న 820 మిలియన్ల మంది ప్రజలు

    దేశవ్యాప్తంగా సురక్షితమైన తాగునీటిని అందించడం వల్ల కలిగే లాభాలపై అంచనా వేయడానికి అధ్యయనం చేయాలని డబ్ల్యూహెచ్ఓను తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం చేసి నివేదికను వెల్లడించింది.

    జల్ జీవన్ మిషన్ దేశంలోని అన్ని గ్రామాలను కవర్ చేయగలిగితే ఏడాదికి 14 మిలియన్ల మంది దేశ ప్రజలను నీటి సంబంధిత వ్యాధుల నుంచి కాపాడవచ్చని అధ్యయనం చెప్పింది.

    2024 నాటికి భారతదేశంలోని ప్రతి కుటుంబాన్నిట్యాప్ వాటర్ కనెక్షన్ ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 62.84శాతానికి చేరుకుంది.

    దేశంలోని 12 ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాల్లో దాదాపు 820 మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నట్లు ప్రపంచ బ్యాంక్ లెక్కలు చెబుతున్నాయి.

    తాగునీరు

    దేశంలో 36శాతం మంది ఇంటి పరిసరాల్లో మెరుగైన తాగునీటి వనరులు లేవు

    గ్రామీణ భారతంలోని ప్రజలు నీటికోసం చాలా దూరం వెళ్లాల్సి ఉంటుందని నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ చెబుతోంది.

    జార్ఖండ్‌లోని మహిళలను పరిగణనలోకి తీసుకోకుండా 40నిమిషాలు పడుతుంది. బిహార్‌లో ఇది 33నిమిషాలు, మహారాష్ట్రలో 24నిమిషాలు పడుతుంది.

    జల్ జీవన్ మిషన్ అందుబాటులోకి వస్తే అన్ని గ్రామీణ ఇళ్లకు సురక్షితమైన వాటర్ కనెక్షన్ వస్తుంది.

    తద్వారా వారి సమయం ఆదా అవుతుందని నివేదికలు చెబుతున్నారు. భారత్‌లో నీరు, పారిశుద్ధ్య సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు.

    అందుకే డబ్ల్యూహెచ్ఓ తన అధ్యయనంలో డయేరియా వ్యాధులపై దృష్టి సారించింది.

    2018లో 44శాతం గ్రామీణ జనాభాతో సహా భారతదేశ మొత్తం జనాభాలో 36శాతం మందికి తమ ఇంటి పరిసరాల్లో మెరుగైన తాగునీటి వనరులు అందుబాటులో లేవు.

    తాగునీరు

    జల్ జీవన్ మిషన్ పూర్తయితే సమయం ఆదా

    దేశంలో గ్రామీణ కుళాయి నీటి కనెక్షన్లు 2019లో 16.64శాతం ఉంటే, ఇప్పుడు 62.84శాతానికి చేరుకున్నాయి.

    41 నెలల వ్యవధిలో ఈ పెరుగుదల నమోదైంది. ఇది సగటు వార్షిక పెరుగుదల 13.5శాతం అని తాగునీరు, పారిశుద్ధ్య విభాగం కార్యదర్శి మహాజన్ అన్నారు.

    2018 నుంచి దేశవ్యాప్తంగా మహిళలు గృహావసరాలను తీర్చేందుకు రోజూ సగటున 45.5 నిమిషాలు నీటిని సేకరిస్తున్నారు. ఇంటి ఆవరణలో నీటి వనరులు లేని కుటుంబాలు మొత్తం 66.6 మిలియన్ గంటలపాటు నీటిని సేకరించేందుకు వెచ్చించారు.

    ఇందులో ఎక్కువ శాతం గ్రామీణ జనాభా ఉన్నారు. ట్యాప్ వాటర్ సదుపాయం ద్వారా నీటి సేకరణలో సయమాన్ని గణనీయంగా పొదుపు చేయొచ్చని నివేదిక చెబుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచ ఆరోగ్య సంస్థ
    భారతదేశం
    తాజా వార్తలు

    తాజా

    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు

    ప్రపంచ ఆరోగ్య సంస్థ

    హెటిరో కరోనా ఔషధం 'నిర్మాకామ్'కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం కోవిడ్
    చైనాపై పెరుగుతున్న ఆంక్షలు.. మరణాలపై తాజా డేటా ఇవ్వాలని కోరిన డబ్ల్యూహెచ్ఓ చైనా
    నోయిడాలో తయారు చేస్తున్న ఆ రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దు : డబ్ల్యూహెచ్‌ఓ ఉజ్బెకిస్తాన్
    చికెన్‌పాక్స్ కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం జబ్బు

    భారతదేశం

    ఎస్‌అండ్‌పీ: 2023లో భారత వృద్ధి రేటు 6శాతం; బీబీబీ రేటింగ్ వృద్ధి రేటు
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  జీ20 సమావేశం
    ఆస్ట్రేలియా: పర్రమట్టా మేయర్‌గా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి సమీర్ పాండే ఆస్ట్రేలియా

    తాజా వార్తలు

    భారీ టార్పెడోను విజయవంతంగా పరీక్షించిన భారత నేవీ నౌకాదళం
    రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్  రెజ్లింగ్
    వర్జీనియా: గ్రాడ్యుయేషన్ వేడుకలో కాల్పులు; ఇద్దరు మృతి  వర్జీనియా
    అమెరికా కాంగ్రెస్‌లో మోదీ రెండోసారి ప్రసంగం; ఆ ఘనత సాధించిన తొలి భారత ప్రధాని అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025