
Assembly Bypoll Result 2025 : గుజరాత్లో ఆప్, కేరళలో కాంగ్రెస్.. అసెంబ్లీ బైపోల్స్ ఫలితాలు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్లలో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. గుజరాత్లోని విశావదర్, కడి నియోజకవర్గాల కోసం కౌంటింగ్ జరిగింది. తాజా ఫలితాల ప్రకారం బీజేపీ విశావదర్ నియోజకవర్గంలో విజయకేతనం ఎగురవేయగా, ఆమ్ ఆద్మీ పార్టీ కడి స్థానాన్ని కైవసం చేసుకుంది. కేరళలోని నీలంబర్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. పంజాబ్లోని లూథియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్లోని కాలిగంజ్ స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
Details
కడిలో బీజేపీ అభ్యర్థి విజయం
జూన్ 19న ఈ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు పోలింగ్ జరిగింది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే అభ్యర్థులు విజయ దిశగా దూసుకెళ్లారు. విశావదర్లో ఆప్ అభ్యర్థి గోపాల ఇటాలియా విజయాన్ని సాధించగా, కడిలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా విజయం సాధించారు. కేరళలోని నీలంబర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించింది. భారత ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ప్రకారం, పంజాబ్లోని లూథియానా వెస్ట్ స్థానంలో ఆప్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కాలిగంజ్ నియోజకవర్గంలో విజయానికి దగ్గరగా ఉంది.
Details
శాసనసభ్యులు మరణించడంతో ఉప ఎన్నికలు
గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్లలో ఒక్కొక్క చోట ప్రస్తుత శాసనసభ్యులు మరణించడం వల్ల ఉప ఎన్నికలు జరగగా, కేరళ, గుజరాత్లలో ఇద్దరు శాసనసభ్యులు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కేరళలోని నీలంబర్ ఫలితాలపై వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్యదాన్ షౌకత్ విజయం పార్టీని మరింత ముందుకు నడిపిస్తుందని, యూడీఎఫ్ సిద్ధాంతాలపై నమ్మకాన్ని ఉంచిన నీలంబర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్లో ఆప్ విజయం సాధించడం పట్ల ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయంతో కార్యకర్తల మనోధైర్యం పెరుగుతుందని, పంజాబ్లో కూడా పార్టీ విజయానికి దగ్గరగా ఉన్నట్లు తెలిపారు.