NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Manish Sisodia: రావణాసురుడి వారసులు స్పదించారు.. ఆప్‌,బీజేపీల మధ్య మాటల యుద్ధం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Manish Sisodia: రావణాసురుడి వారసులు స్పదించారు.. ఆప్‌,బీజేపీల మధ్య మాటల యుద్ధం
    రావణాసురుడి వారసులు స్పదించారు.. ఆప్‌, భాజపాల మధ్య మాటల యుద్ధం

    Manish Sisodia: రావణాసురుడి వారసులు స్పదించారు.. ఆప్‌,బీజేపీల మధ్య మాటల యుద్ధం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 21, 2025
    02:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ వాతావరణం ఉత్కంఠగా మారింది.

    అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రధాన విపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది.

    ఈ నేపథ్యంలో ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

    రామాయణంలోని మాయలేడి ఉదాహరణతో కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సత్వరంగా స్పందించారు.

    దీనిపై ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోదియా తన సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశారు.

    వివరాలు 

    బీజేపీపై కేజ్రీవాల్‌ తీవ్ర ఆరోపణలు

    "నిన్న కేజ్రీవాల్‌ రావణుడికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. రావణుడి వారసులు (బీజేపీ నేతలు) వెంటనే స్పందించారు.

    దిల్లీ ప్రజలు వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించాలి. వారు దిల్లీ ప్రజలకు రావణుడి కంటే పెద్ద ముప్పుగా మారతారు. జాగ్రత్తగా ఉండండి. వారి లక్ష్యం అధికారాన్ని చేజిక్కించుకోవడం, భూములను ఆక్రమించడం మాత్రమే" అని సిసోదియా రాసుకొచ్చారు.

    సోమవారం విశ్వాస్ నగర్‌లోని మురికివాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్‌ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

    "ఎన్నికల తర్వాత బీజేపీ మురికివాడ ప్రజల భూములను అమ్మేస్తుంది. రామాయణంలోని మాయలేడిని గుర్తుంచుకోండి. బీజేపీ నేతల మోసపూరిత ఉచ్చులో చిక్కుకోకండి" అంటూ ఓటర్లను హెచ్చరించారు.

    వివరాలు 

     ఖండించిన బీజేపీ 

    కేజ్రీవాల్‌ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. "కేజ్రీవాల్‌ సనాతన ధర్మాన్ని అవమానించారు. రామచరితమానస్‌ను తారుమారు అర్థం చేసుకున్నారు" అని దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ విమర్శించారు.

    దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగుతాయి. ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడనున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీల నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మనీష్ సిసోడియా

    తాజా

    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా

    మనీష్ సిసోడియా

    మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: మార్చి 20వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ దిల్లీ
    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    జైలులో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు సీబీఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025