NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'Bharat Jodo' vs 'Bharat Todo': కాంగ్రెస్, బీజేపీ మధ్య సైద్ధాంతిక యుద్ధం: రాహుల్ గాంధీ 
    తదుపరి వార్తా కథనం
    'Bharat Jodo' vs 'Bharat Todo': కాంగ్రెస్, బీజేపీ మధ్య సైద్ధాంతిక యుద్ధం: రాహుల్ గాంధీ 
    కాంగ్రెస్, బీజేపీ మధ్య సైద్ధాంతిక యుద్ధం: రాహుల్ గాంధీ

    'Bharat Jodo' vs 'Bharat Todo': కాంగ్రెస్, బీజేపీ మధ్య సైద్ధాంతిక యుద్ధం: రాహుల్ గాంధీ 

    వ్రాసిన వారు Stalin
    Jun 23, 2023
    01:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శుక్రవారం బిహార్‌‌ పాట్నలోని రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యాలయం సడకత్‌ ఆశ్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

    పాట్నలో నిర్వహిస్తున్న ప్రతిపక్ష నాయకుల సమావేశానికి హాజరవడానికి ముందు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

    భారతదేశంలో కాంగ్రెస్‌పార్టీకి, బీజేపీ మధ్య సైద్ధాంతిక యుద్ధం నడుస్తోందన్నారు.

    కాంగ్రెస్ 'భారత్ జోడో', ఆరెస్సెస్, బీజేపీల 'భారత్ తోడో' సిద్ధాంతాల మధ్య భావజాల యుద్ధం జరుగుతోందని రాహుల్ ధ్వజమెత్తారు.

    బిహార్‌లో కాంగ్రెస్ డీఎన్‌ఏ ఉందన్నారు. విద్వేషం, హింసను వ్యాప్తి చేయడానికి, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని రాహుల్ అన్నారు. తాము మాత్రం ప్రేమను వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు.

    కాంగ్రెస్

    తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో గెలుస్తాం: రాహుల్

    ప్రతిపక్షాలు ఈరోజు బిహార్‌కు వచ్చాయని, అందరం కలిసి బీజేపీని ఓడిస్తామని రాహుల్ పేర్కొన్నారు.

    కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో గెలుస్తామని స్పష్టం చేశారు. రాజస్థాన్‌లో బీజేపీ ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. పేదలకు అండగా నిలిచి గెలుస్తామని వెల్లడించారు.

    కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, బిహార్‌లో పార్టీ గెలిస్తే దేశవ్యాప్తంగా గెలుస్తామని అన్నారు. దేశానికి, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రజలు ఏకం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    2024లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కోవడానికి వ్యూహాన్ని రూపొందించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకులు పాట్నలో సమావేశమయ్యాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పాట్నలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్

    #Congress senior leader #RahulGandhi appealed to his party leaders to stay united in a fight with #BJP in 2024 Lok Sabha polls, & that BJP-RSS has 'Bharat Todo' ideology in contrast to Congress' 'Bharat Jodo' faith. pic.twitter.com/mQLH4AGpkO

    — IANS (@ians_india) June 23, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    కాంగ్రెస్
    పాట్న
    బిహార్

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    రాహుల్ గాంధీ

    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్; 20వ తేదీకి ఉభయ సభలు వాయిదా లోక్‌సభ
    నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ కాంగ్రెస్
    రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    కేంద్రం ఆరోపణలపై స్పందించడానికి అనుమతి ఇవ్వండి; స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ లోక్‌సభ

    కాంగ్రెస్

    నేడు హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ రాక: అమె 'పొలిటికల్ టూరిస్ట్' అంటూ కేటీఆర్ ఫైర్ ప్రియాంక గాంధీ
    సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం; ఈసీకి ఫిర్యాదు  కర్ణాటక
    సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్ రాజస్థాన్
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే కర్ణాటక

    పాట్న

    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర
    'వన్ ఆన్ వన్' వ్యూహం: 450లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్షాల నుంచి బీజేపీపై ఒక్కరే పోటీ  లోక్‌సభ
    పాట్నాలో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి కేసీఆర్‌ను ఆహ్వానించలేదు: తేజస్వీ యాదవ్ బిహార్
    బిహార్: రేపు పాట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశానికి రంగం సిద్ధం బిహార్

    బిహార్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్ భారతదేశం
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025