NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uber: 'క్యాబ్ బుకింగ్‌లకు టిప్ మోడల్ అనైతికం'.. ఉబర్‌కు నోటీసు పంపిన ప్రహ్లాద్ జోషి 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Uber: 'క్యాబ్ బుకింగ్‌లకు టిప్ మోడల్ అనైతికం'.. ఉబర్‌కు నోటీసు పంపిన ప్రహ్లాద్ జోషి 
    'క్యాబ్ బుకింగ్‌లకు టిప్ మోడల్ అనైతికం'.. ఉబర్‌కు నోటీసు పంపిన ప్రహ్లాద్ జోషి

    Uber: 'క్యాబ్ బుకింగ్‌లకు టిప్ మోడల్ అనైతికం'.. ఉబర్‌కు నోటీసు పంపిన ప్రహ్లాద్ జోషి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 22, 2025
    08:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో ఊబర్, ఓలా లాంటి క్యాబ్ సర్వీసులను అనేక మంది ప్రజలు నిత్యం ఉపయోగిస్తుంటారు.

    ఈ రవాణా సేవలపై చాలామంది అధికంగా ఆధారపడుతున్నారు.అయితే,ఈ క్యాబ్‌లు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండకపోవడం,అందుబాటులో ఉన్నా కూడా డ్రైవర్లు వెంటనే రావడం లేదని తరచూ వినిపిస్తున్న అసంతృప్తి ఉంది.

    ఈ సమస్యకు పరిష్కారంగా ఊబర్ సంస్థ "అడ్వాన్స్ టిప్" అనే విధానాన్ని ప్రవేశపెట్టింది.

    ఈ కొత్త ఫీచర్ ప్రకారం,ప్రయాణికులు ముందుగానే టిప్ చెల్లిస్తే డ్రైవర్లు త్వరగా రావచ్చని ఊబర్ పేర్కొంది.

    అయితే ఈ విధానంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే క్యాబ్ రైడ్‌ రేట్లు పెరిగిపోయి ప్రయాణికులపై ఆర్థిక భారం పెంచుతున్నాయన్న ఆవేదన ఉండగానే,ఇప్పుడు టిప్ వ్యవహారంతో ఇది మరో వ్యాపార మోసంగా భావిస్తున్నవారు చాలామంది.

    వివరాలు 

    టిప్ పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం

    టిప్ ఇచ్చినవారికే ముందుగా సేవ అందిస్తే, భవిష్యత్తులో అందరూ టిప్ కోరే అవకాశం ఉందని, టిప్ ఇవ్వని ప్రయాణికులకు డ్రైవర్లు వెళ్లరని ఆరోపణలు వెలువడుతున్నాయి.

    ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది."వినియోగదారులు వేగవంతమైన సేవ కోసం ముందుగానే టిప్ చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేయడం అనైతికం,ఇది వాణిజ్య దోపిడీకి దారితీస్తుంది" అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు.

    వినియోగదారులు సేవల పట్ల సంతృప్తిగా ఉన్నప్పుడు స్వచ్ఛందంగా టిప్ ఇవ్వడమే మంచిదని, బలవంతంగా టిప్ వసూలు చేయడం అన్యాయం అని ఆయన అభిప్రాయపడ్డారు.

    ఈ ప్రకటనతో పాటు, కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (CCPA) ఊబర్‌కు నోటీసులు జారీ చేసి, అడ్వాన్స్ టిప్ విధానంపై స్పష్టత కోరింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రహ్లాద్ జోషి చేసిన ట్వీట్ 

    The practice of 'Advance Tip' is deeply concerning. Forcing or nudging users to pay a tip in advance, for faster service is unethical and exploitative. Such actions fall under unfair trade practices. Tip is given as a token of appreciation not as a matter of right, after the… pic.twitter.com/WaPH26oT9G

    — Pralhad Joshi (@JoshiPralhad) May 21, 2025

    వివరాలు 

    డిఫరెన్షియల్ ప్రైసింగ్ వ్యవహారంపై  ఉబర్‌కు నోటీసులు 

    ఇది మాత్రమే కాదు,గతంలో ఊబర్,ఓలా యాప్‌లు ఐఫోన్, ఆండ్రాయిడ్ లాంటి వేర్వేరు డివైస్‌లపై ఒకే రైడ్‌కు వేరే వేరే ధరలు చూపిస్తున్నాయన్న ఆరోపణలపై కూడా కేంద్రం స్పందించింది.

    ఈ డిఫరెన్షియల్ ప్రైసింగ్ వ్యవహారంపై 2025 జనవరి 23న CCPA ద్వారా ఉబర్‌కు నోటీసులు ఇచ్చారు.

    ఇక డ్రైవర్ల అభిప్రాయాలను చూసినా,ఈ అడ్వాన్స్ టిప్ వ్యవస్థపై వారు కూడా అసంతృప్తిగా ఉన్నారు.

    ప్రయాణికులు ఇచ్చే టిప్స్ పూర్తిగా తమకు అందడం లేదని,వాటిని ఊబర్ యాజమాన్యం కట్టేసుకుంటోందని వారు ఆరోపిస్తున్నారు.

    ఇందుకు సంబంధించి కొందరు డ్రైవర్లు సోషల్ మీడియాలో ప్రూఫ్‌లు కూడా షేర్ చేస్తున్నారు.

    వివరాలు 

    టిప్ ఫీచర్‌పై ఫిర్యాదు చేయాలనుకుంటే..

    ప్రయాణికులు ఈ అడ్వాన్స్ టిప్ ఫీచర్‌పై ఫిర్యాదు చేయాలనుకుంటే, ఉబర్ యాప్‌లో ఉన్న "Help" విభాగం ద్వారా లేదా help.uber.com వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు.

    అలాగే కేంద్ర వినియోగదారుల హెల్ప్‌లైన్ 1915 ద్వారా లేదా jagograhakjago.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రహ్లాద్ జోషి

    తాజా

    Uber: 'క్యాబ్ బుకింగ్‌లకు టిప్ మోడల్ అనైతికం'.. ఉబర్‌కు నోటీసు పంపిన ప్రహ్లాద్ జోషి  ప్రహ్లాద్ జోషి
    Trump: ఖతార్‌ విమాన బహుమతిపై ప్రశ్న.. 'గెట్ అవుట్' అంటూ.. విలేకరిపై మండిపడ్డ ట్రంప్  డొనాల్డ్ ట్రంప్
    IND-USA: జూలై 8లోగా అమెరికా,భారత్ వాణిజ్య ఒప్పందం వాణిజ్యం
    cholera vaccine HillChol: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'హిల్‌కాల్' కలరా టీకా.. క్లినికల్‌ పరీక్షల్లో విజయవంతం టీకా

    ప్రహ్లాద్ జోషి

    జనవరి 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఏప్రిల్ 6న ముగింపు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    జులై 30 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు  రాజ్యసభ
    సెప్టెంబర్‌లో ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు  భారతదేశం
    ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం ఏం చేయబోతోంది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025