Page Loader
Air India: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. కేంద్రానికి ప్రాథమిక నివేదిక..  
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. కేంద్రానికి ప్రాథమిక నివేదిక..

Air India: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. కేంద్రానికి ప్రాథమిక నివేదిక..  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
01:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూన్ 12న అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించి, 'ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)' తన ప్రాథమిక నివేదికను మంగళవారం పౌర విమానయాన శాఖకు (Civil Aviation Ministry) అందజేసింది. ఈ నివేదికను సంబంధిత ఇతర అధికార సంస్థలకూ పంపినట్టు కేంద్ర ప్రభుత్వంలోని కీలక వర్గాలు తెలియజేశాయి. ఇప్పటివరకు చేసిన దర్యాప్తులో లభించిన వివరాలను ఈ నివేదికలో ఏఏఐబీ పొందుపరిచినట్టు సమాచారం. అయితే ఈ ప్రాథమిక నివేదికలో ఉన్న విషయాల్ని అధికారికంగా వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఈ నివేదికలో విమాన ప్రయాణ సమయంలో నమోదైన డాటా, సిబ్బంది తీరుతెన్నులు, వాతావరణ పరిస్థితులు, మెకానికల్ పనితీరుపై నిర్వహించిన విశ్లేషణ వంటి ముఖ్యాంశాలు చేర్చినట్లు తెలుస్తోంది.

వివరాలు 

భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు  సూచనలు 

అయితే ఇది కేవలం ఒక ప్రారంభ అధ్యయన నివేదిక మాత్రమే.అసలు ప్రమాదానికి గల స్పష్టమైన కారణాన్ని గుర్తించేందుకు ఏఏఐబీ ఇంకా లోతుగా విచారణ చేపట్టనుంది. ఈ దర్యాప్తు పూర్తి అయిన తర్వాత, భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, చర్యలపై సూచనలు ఇవ్వనుంది. గత నెల 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం, టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై కూలిపోయింది. ఈ విషాదకర ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 241 మంది ప్రయాణికులు, అలాగే హాస్టల్‌లో ఉన్న 38 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ఘటనలో కేవలం ఒకే ఒక్క వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడినట్టు అధికారులు తెలిపారు.