NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Air India 'Pee-gate': తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన తుషార్ మసంద్ ఎవరు?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Air India 'Pee-gate': తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన తుషార్ మసంద్ ఎవరు?
    తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన తుషార్ మసంద్ ఎవరు?

    Air India 'Pee-gate': తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన తుషార్ మసంద్ ఎవరు?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 10, 2025
    03:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎయిర్ ఇండియా విమానంలో అపఖ్యాతి పాలైన 'పీ-గేట్' ఎపిసోడ్ జరిగిన దాదాపు 3 సంవత్సరాల తరువాత ఇటువంటి ఘటన చోటుచేసుకుంది.

    ఎయిర్‌ ఇండియాకు చెందిన AI 2336 విమానం దిల్లీ నుంచి బ్యాంకాక్‌కు బుధవారం ఉదయం బయలుదేరింది.

    కాసేపట్లో ల్యాండ్‌ అవుతుందనగా మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. పక్కనున్న అతడిపై మూత్ర విసర్జన చేశాడు.

    ఈ ఘటనలో పాల్గొన్న భారతీయుడు తుషార్ మసంద్ గా గుర్తించారు, అతనిని 30 రోజుల పాటు ఆ విమానయాన సంస్థలో ప్రయాణించకుండా నిషేధించారు.

    వివరాలు 

    ఎయిర్ ఇండియా ఢిల్లీ - బ్యాంకాక్ విమానంలో 'పీ-గేట్': తుషార్ మసంద్ ఎవరు? 

    దిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తుషార్ మసంద్ అనే వ్యక్తి జపాన్‌కు చెందిన సహ ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన చేశాడు.

    బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అయిన యోషిజానే ఇప్పటివరకు ఈసంఘటనకు సంబంధించి అధికారులకు విషయం తెలపడానికి నిరాకరించినట్లు సమాచారం.

    2D లో కూర్చున్న 24ఏళ్ల మసంద్,లేచి నిలబడి 1D లో కూర్చున్న వ్యాపారవేత్తపై మూత్ర విసర్జన చేసే ముందు రెండు గ్లాసుల సింగిల్ మాల్ట్ విస్కీ తాగాడని NDTV నివేదించింది.

    వెంటనే మసంద్ ను 14C సీటుకు తరలించి హెచ్చరిక జారీ చేశారు,అయితే సిబ్బంది బాధిత ప్రయాణీకుడికి సహాయం చేశారు.

    తరువాత యోషిజానేను బట్టలు మార్చుకోవడానికి టాయిలెట్‌కి తీసుకెళ్లారు. ఈ పరిణామం గురించి కెప్టెన్‌కు సమాచారం అందించారు.

    వివరాలు 

    ఈ సంఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా 

    1F లో కూర్చున్న మాథ్యూగా గుర్తించబడిన మరో ప్రయాణీకుడు, భద్రతా సమస్యల దృష్ట్యా మసంద్ ను బిజినెస్ క్లాస్ క్యాబిన్ నుండి తొలగించాలని కోరుతూ ఆందోళన వ్యక్తం చేసినట్లు మింట్ నివేదిక తెలిపింది.

    ఈ ఘటనపై సంబంధిత ఎయిర్‌లైన్స్ స్పందించింది. "ఆ ప్రయాణికుడిని మేము హెచ్చరించాము. అయితే బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేయడం నిరాకరించారు. డీజీసీఏ విధించిన మార్గదర్శకాలను మా ఎయిర్‌లైన్స్ పూర్తిగా పాటిస్తుంది. ఈ ఘటనను సమగ్రంగా పరిశీలించేందుకు ఒక స్వతంత్ర స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం," అని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

    వివరాలు 

    ఈ సంఘటనపై సోషల్ మీడియా ఎలా స్పందించింది 

    ఈ సంఘటనపై సోషల్ మీడియాలో చాలా మంది వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు, చాలామంది వ్యంగ్యంగా స్పందించారు.

    "దయచేసి ప్రతి ప్రయాణీకుడికి ఒక పెద్దవాళ్ళ డైపర్ అందించండి" అని ఒక వినియోగదారు చమత్కరించారు.

    "ఇది ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ విమానాల్లో భారతీయ ప్రయాణికులకు డైపర్లు తప్పనిసరి అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు" అని మరొకరు రాశారు.

    "ఇది దారుణం,ఆమోదయోగ్యం కాదు. అటువంటి ప్రయాణీకులను గాల్లోనే వదిలేసే అధికారం పైలట్లకు ఇవ్వాలి" అని మరో వినియోగదారు వ్యాఖ్యానించారు.

    వివరాలు 

    2022 'పీ-గేట్'లో ఏం జరిగింది? 

    తాజాగా ఎయిరిండియా విమానంలో చోటు చేసుకున్న మూత్ర విసర్జన ఘటన,2022లో జరిగిన మరొక నిర్ఘాంతక సంఘటనను మళ్లీ గుర్తుకు తీసుకొచ్చింది.

    2022 నవంబర్ 26న,న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో,ముంబైకు చెందిన శంకర్ మిశ్రా అనే వ్యక్తి ఓ వృద్ధ మహిళపై మూత్ర విసర్జన చేశాడు.

    ఈ సంఘటన అనంతరం మిశ్రాను పోలీస్‌లు అరెస్టు చేశారు.అతను పనిచేస్తున్న వెల్స్ ఫార్గో అనే సంస్థ వెంటనే అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది.

    వివరాలు 

    లైంగిక వేధింపులు,అశ్లీల ప్రవర్తన కేసులు నమోదు

    శంకర్ మిశ్రా, అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కేంద్రం కలిగిన బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గోలో భారత విభాగానికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

    2023 జనవరిలో,ఈ సంఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఆయనపై లైంగిక వేధింపులు,అశ్లీల ప్రవర్తన కేసులు నమోదు చేశారు.

    దీంతోపాటు, ఎయిరిండియా సంస్థ అతడిపై కఠిన చర్యలు తీసుకుని 30 రోజుల పాటు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ ఇండియా

    తాజా

    Andhra News: రాజధాని నుంచి రాయలసీమకు యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు ప్రణాళిక అమరావతి
    Pakistan: పాక్‌లో కలకలం.. మాలిర్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్ పాకిస్థాన్
    NEET PG Exam 2025 : నీట్ పీజీ 2025 పరీక్ష వాయిదా.. NBEMS కీలక ప్రకటన  ఇండియా
    Earthquake: గ్రీస్‌లోని రోడ్స్ సమీపంలో 6.2 తీవ్రతతో భూకంపం.. టర్కీ, ఈజిప్ట్, సిరియాలో ప్రకంపనలు  భూకంపం

    ఎయిర్ ఇండియా

    Canada :పన్నూన్ బెదిరింపులపై కెనడా సీరియస్..ఎయిర్ ఇండియాకు భద్రతను పెంచుతామని భారత్'కు హామీ కెనడా
    Air India: : అయోధ్యకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. ఎప్పటి నుంచంటే? నరేంద్ర మోదీ
    Air India fined: ఎయిర్ ఇండియాకు రూ.1.10కోట్ల జరిమానా విధించిన డీజీసీఏ  తాజా వార్తలు
    Air India: ఎయిర్ ఇండియా సిబ్బంది 'మాస్ సిక్ లీవ్'.. రద్దైన 70 అంతర్జాతీయ,దేశీయ విమానాలు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025