NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో మంటలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్
    తదుపరి వార్తా కథనం
    టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో మంటలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్
    టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో మంటలు

    టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో మంటలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్

    వ్రాసిన వారు Stalin
    Feb 03, 2023
    03:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పైలట్ అప్రమత్తంగా ఉండటం వల్ల అబుదాబి నుంచి కేరళలోని కోజికోడ్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వినామానికి పనుప్రమాదం తప్పింది.

    అబుదాబి విమానాశ్రయంలో విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజిన్‌లో మంటలు కనిపించాయి. ఈ క్రమంలో చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి అబుదాబి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది.

    విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని విమానయాన సంస్థ తెలిపింది. ఈ ఘటన సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నట్లు డీజీసీఏ వెల్లడించింది.

    ఎయిర్ ఇండియా

    1000 అడుగుల పైకి వెళ్లిన తర్వాత ఇంజిన్‌లో మంటలు గుర్తింపు

    విమానం 1000 అడుగుల పైకి వెళ్లిన తర్వాత పైలెట్ ఇంజిన్‌లో మంటలు గుర్తించినట్లు ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ తెలిపింది. ఈ క్రమంలో అత్యవసర ల్యాండింగ్ కోసం విమానాశ్రయానికి తిరిగి రావాలని పైలెట్ నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది.

    జనవరి 23 సంఘటన కూడా ఎయిర్ ఇండియాకు చెందిన విమానానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. త్రివేండ్రం-మస్కట్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. ఆ సమయలో ఫ్లైట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎఫ్ఎంఎస్)లో సమస్య తలెత్తినట్లు అధికారులు పేర్కొన్నారు.

    రెండు వారాల్లోనే ఎయిర్ ఇండియాకు ఇది రెండో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ ఇండియా
    కేరళ
    విమానం

    తాజా

    Indian Air Force: మరో వీడియో షేర్ చేసిన భారత సైన్యం..శత్రు దేశాలకు స్ట్రాంగ్‌ మెసేజ్‌..చూస్తే గూస్ బంప్స్ ఖాయం ఆపరేషన్‌ సిందూర్‌
    AP Cabinet meeting: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్‌ అనుమతి ఆంధ్రప్రదేశ్
    Anaganaga:ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న 'అనగనగా'.. స్ట్రీమింగ్‌లో అరుదైన రికార్డు టాలీవుడ్
    Abhishek Banerjee: యూసుఫ్ పఠాన్ ఔట్, అభిషేక్ బెనర్జీ ' ఇన్‌!.. ఆపరేషన్ సిందూర్' కోసం ఎంపిక తృణమూల్ కాంగ్రెస్‌

    ఎయిర్ ఇండియా

    ప్యారిస్-ఢిల్లీ: ప్రయాణికుల వికృత చేష్టలను దాచిపెట్టిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ సీరియస్ దిల్లీ
    విమానంలో మూత్ర విసర్జన: నిందితుడికి బెయిల్ నిరాకరించిన దిల్లీ కోర్టు దిల్లీ
    ఎయిర్ ఇండియా కేసులో ట్విస్ట్: 'మూత విసర్జన నేను చేయలేదు, ఆమెనే చేసుకుంది' ఎయిర్ టెల్
    విమానంలో మూత్ర విసర్జన కేసు: ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ దిల్లీ

    కేరళ

    ఆపరేషన్ 'పీఎఫ్ఐ'.. కేరళ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు భారతదేశం
    కేరళలో మరో సంపన్న ఆలయం.. గురువాయూర్ గుడి బ్యాంకు డిపాజిట్లు ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా? భారతదేశం
    ఇక ఉపాధ్యాయులను 'సార్', 'మేడమ్' అని పిలవరు, కేరళ పాఠశాలల్లో కొత్త ఒరవడి భారతదేశం
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కాంగ్రెస్

    విమానం

    NOTAMలో సమస్య వలన అమెరికా అంతటా ఆగిపోయిన కొన్ని వేల విమానాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం నేపాల్
    నేపాల్ విమాన ప్రమాదం: చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్, ఆ నలుగురూ స్నేహితులే! నేపాల్
    నేపాల్ విమాన ప్రమాదం: కీలకమైన రెండు బ్లాక్ బాక్స్‌లు స్వాధీనం నేపాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025