NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు
    అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు..

    Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 09, 2025
    12:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో యుద్ధ పరిస్థితులను ఊహిస్తూ ఎయిర్ ఫోర్స్ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు.

    2025, మే 9వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయంలో అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అధికారులు యుద్ధ సైరన్లను మోగించారు.

    పాకిస్థాన్ వైపు నుంచి దాడి జరగవచ్చన్న సమాచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.

    సైరన్ మోగించిన వెంటనే ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అందరూ తమ ఇళ్లలోకి వెళ్లిపోవాలని, కిటికీలకు దూరంగా ఉండాలని, విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపేయాలని సూచించారు.

    వివరాలు 

    రాఫెల్ యుద్ధ విమానాల కార్యకలాపాలకూ  కేంద్రంగా అంబాలా 

    ఈ రోజు తెల్లవారుజామున చండీఘడ్ నగరంలోనూ ఇలాంటి హెచ్చరికలతో సైరన్లు మోగించగా, ఆ తర్వాత అంబాలా ఎయిర్ ఫోర్స్ స్థావరం నుంచీ అధికారికంగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

    ఈ పరిణామాలతో రహదారులు అన్నీ ఖాళీ అయ్యాయి. ప్రజలు త్వరితగతిన ఇళ్లకు చేరిపోయారు.

    అంబాలా సిటీలో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్, పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంగా ఉండటంతో ఇది వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా భావించబడుతోంది.

    రాఫెల్ యుద్ధ విమానాల కార్యకలాపాలకూ ఇదే కేంద్రంగా పనిచేస్తోంది.

    ఈ నేపథ్యంలో అంబాలాను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్‌లు లేదా మిస్సైల్‌ల ద్వారా దాడి చేయొచ్చన్న అనుమానంతో ముందస్తుగా అప్రమత్తత చర్యలు చేపట్టారు.

    వివరాలు 

    ఏ క్షణంలోనైనా దాడి చేసే ప్రమాదం

    యుద్ధ సైరన్లు మోగించడంతో పాటు, స్థానిక ప్రజలకు పలు సూచనలు, అప్రమత్తత సూచనలను ఎయిర్ ఫోర్స్ అధికారులు అందిస్తున్నారు.

    ఏ క్షణంలోనైనా దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, ప్రజలు నిరంతరం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు

    Sirens being sounded in #Ambala cantt as a warning has reportedly been received from Air force station of possible attack. People have been advised to remain indoors and away from balconies #IndiaPakistanTensions #ambala #chandigarh @dwnews pic.twitter.com/bdsOUwzjv5

    — Shalu Yadav (@StoriesByShalu) May 9, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్యానా

    తాజా

    Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు హర్యానా
    IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్!  ఐపీఎల్
    Manoj Sinha: యూరీకి జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా.. ఎందుకంటే ! ఆపరేషన్‌ సిందూర్‌
    Tirumala: తిరుమలలో హై అలెర్ట్..భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా భద్రత కట్టుదిట్టం తిరుమల తిరుపతి

    హర్యానా

    Haryana Election: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రెండో జాబితా విడుదల ఇండియా
    Haryana polls: వృద్ధులు, వితంతువులు,వికలాంగులకు రూ.6వేల పెన్షన్.. ఏడు గ్యారంటీలతో హర్యానాలో కాంగ్రెస్ మేనిఫెస్టో  కాంగ్రెస్
    NRI quota system: 'ఆ ఎన్‌ఆర్‌ఐ కోటా మోసం' ఎంబీబీఎస్‌ ప్రవేశ నిబంధనపై సుప్రీం కోర్టు  సుప్రీంకోర్టు
    Explained: హర్యానా ఎన్నికల్లో 'బుల్డోజర్‌' హవా.. ప్రచారానికి కొత్త వ్యూహం ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025