NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Air Taxi: రెండు, మూడు సీట్లతో ఎయిర్‌ ట్యాక్సీ.. తొలిదశ ప్రయోగాలు విజయవంతం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Air Taxi: రెండు, మూడు సీట్లతో ఎయిర్‌ ట్యాక్సీ.. తొలిదశ ప్రయోగాలు విజయవంతం
    రెండు, మూడు సీట్లతో ఎయిర్‌ ట్యాక్సీ.. తొలిదశ ప్రయోగాలు విజయవంతం

    Air Taxi: రెండు, మూడు సీట్లతో ఎయిర్‌ ట్యాక్సీ.. తొలిదశ ప్రయోగాలు విజయవంతం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 20, 2025
    08:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతికతతో ఎయిర్‌ ట్యాక్సీలను పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రవేశపెట్టేందుకు విస్తృత ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

    ప్రధానంగా చైనా వంటి దేశాలు ఈ రంగంలో ముందంజలో ఉండగా, గుంటూరుకు చెందిన ఒక యువకుడు ఆ దేశాలతో పోటీ పడుతూ, భారతదేశంలోనే ఎయిర్‌ ట్యాక్సీలను అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నాడు.

    ఆయన 'మ్యాగ్నమ్‌ వింగ్స్‌' సంస్థను స్థాపించి, వినూత్న ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.

    మోటర్లను మినహాయిస్తే, మిగతా అన్ని ఉపకరణాలు పూర్తిగా 'మేడ్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌' కావడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.

    వివరాలు 

    2019 నుంచి ప్రయోగాలు 

    గుంటూరుకు చెందిన చావా అభిరాం, అమెరికాలో రోబోటిక్స్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు.

    స్వదేశంలోనే పరిశోధనలు జరిపి, ఓ సంస్థను నెలకొల్పాలనే ఉద్దేశంతో తిరిగి భారత్‌ వచ్చారు.

    దేశంలోని రహదారి ట్రాఫిక్‌ సమస్యను దృష్టిలో పెట్టుకుని, నగరాల్లో ఎయిర్‌ ట్యాక్సీల వినియోగం ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి, సుదీర్ఘ అధ్యయనం చేశారు.

    దేశ, విదేశాల్లో ఎయిర్‌ ట్యాక్సీల రంగంలో జరుగుతున్న పరిశోధనలను సమగ్రంగా విశ్లేషించారు.

    2019లో, గుంటూరు సమీపంలోని నల్లచెరువులో 'మ్యాగ్నమ్‌ వింగ్స్‌'ను స్థాపించి, తొలి చిన్న ఎయిర్‌ ట్యాక్సీని రూపొందించారు.

    పైలట్‌ అవసరం లేకుండా భూమి మీద నుంచే నియంత్రించగల ఈ వాహనం విజయవంతంగా పరీక్షించబడింది.

    వివరాలు 

    రెండు సీట్లతో కూడిన 'వీ2' మోడల్‌ ప్రయోగం 

    అయితే, పైలట్‌ లేని ఎయిర్‌ ట్యాక్సీలకు డీజీసీఏ అనుమతి లేదన్న కారణంగా, పైలట్‌తో పాటు రెండు లేదా మూడు సీట్లతో కూడిన ఎయిర్‌ ట్యాక్సీలను రూపొందించే దిశగా అడుగులు వేస్తున్నారు.

    ఈ ప్రాజెక్టు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించబడుతుంది. ఇప్పటికే రెండు సీట్లతో కూడిన 'వీ2' మోడల్‌ను తయారు చేసి ప్రయోగించారు.

    ఈ ప్రయోగం విజయవంతమైన అనంతరం, మరింత మెరుగైన మూడో వెర్షన్‌ డిజైన్‌ తయారీలో నిమగ్నమయ్యారు. త్వరలోనే మూడు సీట్ల సామర్థ్యంతో 'ఎక్స్‌-4' మోడల్‌ను పరీక్షించనున్నారు.

    వివరాలు 

    ఎయిర్‌ ట్యాక్సీ ప్రయాణం: సౌలభ్యమైన ఖర్చు 

    'వీ2' మోడల్‌ గరిష్టంగా 40 కి.మీ. ప్రయాణించగలదు. ఇది 1,000 అడుగుల ఎత్తులో, గరిష్టంగా 100 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది.

    ఇక 'ఎక్స్‌-4' మోడల్‌ 300 కి.మీ. దూరం,20,000 అడుగుల ఎత్తులో, 300 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు.

    దీని వినియోగం ప్రధానంగా దీర్ఘదూర ప్రయాణాలకు ఉపయోగపడుతుంది. విపణిలోకి రాగానే, 'వీ2' మోడల్‌ సుమారు రూ.2 కోట్లు, 'ఎక్స్‌-4' మోడల్‌ రూ.8 కోట్లు ఉండొచ్చని అభిరాం అంచనా వేశారు.

    అయితే, భవిష్యత్తులో ఎయిర్‌ ట్యాక్సీ ప్రయాణాన్ని సాధారణ క్యాబ్‌ ఖర్చుతోనే అందుబాటులోకి తేవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.

    వీటిలో ఉపయోగించే బ్యాటరీలు సమర్థంగా పనిచేసే విధంగా రూపకల్పన చేయడంతో పాటు, ఎయిర్‌ రూట్‌ మరింత సులభంగా ఉండటంతో నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుందని వివరించారు.

    వివరాలు 

    డ్రాఫ్టింగ్‌ దశలో ఎయిర్‌ ట్యాక్సీ పాలసీ 

    భారతదేశంలో బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో కూడా ఎయిర్‌ ట్యాక్సీలపై ప్రయోగాలు జరుగుతున్నాయి.

    అయితే, ప్రస్తుతం ఎయిర్‌ ట్యాక్సీల విధివిధానాలు ఇంకా ప్రణాళికా దశలోనే ఉన్నాయి.

    పాలసీ పూర్తిగా రూపుదిద్దుకుని, అనుమతులు లభించడానికి కనీసం మూడేళ్లు పట్టొచ్చని అభిరాం తెలిపారు.

    భవిష్యత్తులో 'మ్యాగ్నమ్‌ వింగ్స్‌' ద్వారా ఎయిర్‌ ట్యాక్సీ సేవలను అందించడంతో పాటు, కావాలనుకున్నవారికి ఈ వాహనాలను విక్రయించే అవకాశం కూడా ఉందని వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    ఆంధ్రప్రదేశ్

    Visakhapatnam: రుషికొండ బీచ్‌ పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. అదనపు సిబ్బంది నియామకం విశాఖపట్టణం
    TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. తిరుమల అన్నప్రసాదంలో కొత్త మెను తిరుమల తిరుపతి దేవస్థానం
    Sakthi app: నెట్వర్క్ లేని రిమోట్ ప్రదేశాల్లో కూడా పనిచేసే శక్తి యాప్.. దీని స్పెషాలిటీ ఏంటంటే..? భారతదేశం
    AP SSC Halltickets: ఏపీ పదో తరగతి హాల్‌టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా పొందండి!  వాట్సాప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025