
Delhi: ప్రయాణికులకు అలర్ట్.. దిల్లీ విమానాశ్రయంలో జుకు 114 విమాన సర్వీసులు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరగనున్న రన్వే ఆధునికీకరణ పనుల కారణంగా ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రతిరోజూ 114 దేశీయ విమాన సర్వీసులు రద్దు చేయనున్నట్లు దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ (DIAL) ప్రకటించింది.
అదనంగా మరో 86 విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేయనున్నట్లు సంస్థ తెలిపింది.
ఈ మేరకు వాటాదారులతో విస్తృత చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు DIAL చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విదేహ్ కుమార్ జైపురియార్ వెల్లడించారు.
ప్రస్తుతానికి దిల్లీ విమానాశ్రయంలో నాలుగు రన్వేలు ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు సగటున 1,450 విమానాల రాకపోకలు జరుగుతుంటాయి. అయితే తాజా రద్దులతో ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలగవచ్చని అధికారులు చెప్పారు.
Details
ఇతర ప్రధాన విమానాశ్రయాలపై ప్రభావం
అయితే ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు రద్దీ సమయాల్లో నడిచే కొన్ని విమాన సర్వీసులను సాధారణ సమయాల్లోకి మార్చే ఏర్పాట్లు చేస్తున్నామని జైపురియార్ తెలిపారు.
ముఖ్యంగా ప్రముఖ విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియా లు ఈ కాలంలో ప్రతిరోజూ వరుసగా 33, 25 విమాన సర్వీసులను రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం.
దిల్లీలో జరిగే ఈ మార్పుల ప్రభావం దేశంలోని ఇతర ప్రధాన విమానాశ్రయాలపై కూడా స్వల్పంగా పడనుంది. కొన్ని కీలక విమానాశ్రయాల్లో సర్వీసుల సంఖ్య ఈ విధంగా తగ్గనుంది.
Details
ప్రయాణికులు చెక్ చేసుకోవాలి
ముంబయి : 56 → 54
కోల్కతా : 22 → 21
అహ్మదాబాద్ : 21 → 19
బెంగళూరు : 38 → 36
చెన్నై : 20 → 19
పట్నా : 13 → 12
ఈ రద్దుల నేపథ్యంలో ప్రయాణికులు ముందస్తుగా తమ టికెట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని, తమ ప్రయాణ ప్రణాళికల్లో అవసరమైన మార్పులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.