NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amaravati Construction: అమరావతి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచిన సీఆర్డీఏ..  
    తదుపరి వార్తా కథనం
    Amaravati Construction: అమరావతి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచిన సీఆర్డీఏ..  
    అమరావతి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచిన సీఆర్డీఏ

    Amaravati Construction: అమరావతి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచిన సీఆర్డీఏ..  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 31, 2024
    11:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రక్రియ త్వరగా ప్రారంభమైంది.

    కొత్త ఏడాది ప్రారంభంలో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

    సీఆర్డీఏ 1200 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచింది.

    ఈ పనులకు ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో చర్యలు తీసుకుంటున్నారు.

    ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో భాగంగా, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి వేర్వేరు టెండర్లు పిలవడం జరిగింది.

    జోన్ 5b 5d లో రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయడానికి 1206 కోట్ల రూపాయల విలువైన పనులు చేపట్టనున్నారు.

    వచ్చే నెల 21వ తేదీ వరకు టెండర్లు సమర్పించేందుకు గడువు నిర్ణయించారు.

    వివరాలు 

    కీలకమైన పనులకు గ్రీన్ సిగ్నల్

    జనవరి నెలాఖరులో పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. రెండు మూడు రోజుల్లో మిగతా పనుల కోసం కూడా టెండర్లు పిలవనున్నారని అధికారులు తెలిపారు.

    గత ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణ పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

    మూడు రాజధానుల ప్రతిపాదనతో వైసీపీ ప్రభుత్వం విశాఖను రాజధానిగా నిర్ణయించింది. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది.

    ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కాలంలో ప్రారంభించిన పనులను పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.

    అమరావతి నిర్మాణ పనులను శరవేగంగా సాగించేందుకు ఆయన వివిధ ప్రణాళికలను రూపొందించారు. ఈ ప్రణాళికల భాగంగా కీలకమైన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    అమరావతి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025