NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / America :అమెరికాలో తెలుగోడిపై సాటి తెలుగువారి కిరాతకం.. 7నెలలుగా చెప్పింది చేయకుంటే అరాచకం
    తదుపరి వార్తా కథనం
    America :అమెరికాలో తెలుగోడిపై సాటి తెలుగువారి కిరాతకం.. 7నెలలుగా చెప్పింది చేయకుంటే అరాచకం
    7నెలలుగా చెప్పింది చేయకుంటే అరాచకం

    America :అమెరికాలో తెలుగోడిపై సాటి తెలుగువారి కిరాతకం.. 7నెలలుగా చెప్పింది చేయకుంటే అరాచకం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 01, 2023
    05:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అగ్రరాజ్యం అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకుల అరాచక చర్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

    ఈ మేరకు 20ఏళ్ల యువకుడిని బంధించి, తీవ్రంగా హింసించారు.దాదాపు 7 నెలలుగా రాక్షసంగా వేధించారు. అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ పరిధిలో ఈ ఘోరం జరిగింది.

    సదరు విద్యార్థిపై సత్తారు వెంకటేశ్ రెడ్డి,నిఖిల్,శ్రవణ్,ఈ ముగ్గురు తమ పైశాచికత్వాన్ని చూపించారు.

    ఓ రెస్టారెంట్ లో బాధిత యువకుడు మరో వ్యక్తికి తీవ్ర ఆవేదనతో కనిపించగా అతను పలకరించాడు. సమస్య ఉంటే తనకు ఫోన్ చేయమని చెప్పి తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు.

    ఈ క్రమంలోనే ఈ ముగ్గురు యువకులు నిత్యం తనను వేధిస్తున్నారని వాట్సాప్ ద్వారా మొరపెట్టుకున్నాడు.యువకుడి దుస్థితికి చలించిపోయి పోలీసులకు సమాచారం అందించాడు.

    DETAILS

    మానవ అక్రమ రవాణా, హింస తదితర సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు

    వెంటనే ఆ ముగ్గురి నివాసానికి చేరుకున్న పోలీసులు లోపలకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో ముగ్గురు నిరాకరించారు.

    పోలీసులు వచ్చిన విషయాన్ని గ్రహించిన బాధితుడు, వెంటనే పోలీసులకు తన గోడును వెళ్లబోసుకున్నాడు.

    ఆ ముగ్గిరి బారి నుంచి తనను రక్షించాలని అర్థించాడు. అనంతరం ముగ్గురుని అరెస్ట్ చేసిన పోలీసులు మానవ అక్రమ రవాణా, హింస తదితర సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.

    తనను రోజూ చావబాదేవారని. ఇందుకు పీవీసీ పైపులు, ఇనుప రాడ్లు, విద్యుత్ వైర్లను ఉపయోగించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

    DETAILS

    వెంకట్ రెడ్డి రోజు 2గంటలు మసాజ్ చేయించుకునేవాడు : బాధితుడు

    వాళ్ల దెబ్బలకు నుదుటి నుంచి పాదాల వరకు గాయాలై పక్కటెముకలు విరిగాయని కంటతడి పెట్టుకున్నాడు.

    ఇంట్లో చాకీరీ చేయించేవారని, వెంకట్ రెడ్డి రోజు 2గంటలు మసాజ్ చేయించుకునేవాడని వివరించాడు.

    రోజుకు 3గంటలు మాత్రమే పడుకునేందుకు అనుమతించేవారన్నాడు. ఈ హింస కారణంగా అమెరికాకు వచ్చిన తర్వాత 7 నెలల్లో 30 కిలోల మేర బరువు తగ్గినట్లు ఆందోళన వ్యక్తం చేశాడు.

    దీంతో తీవ్రంగా నీరసించిపోయిన బాధితుడికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మరోవైపు బాధితుడు ఎవరు, ఎందుకు ఈ ముగ్గురి చేతికి చిక్కాడు, బాధితుడిని వీళ్లు ఎందుకు హింసిస్తున్నారు అన్న కారణాలు తెలియాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    అమెరికా

    Canada vs India: భారత్‌తో దౌత్య వివాదం.. కెనడాకు మద్దతుగా నిలిచిన అమెరికా, బ్రిటన్ భారతదేశం
    LAC: రోడ్లు, విమానాశ్రయాలు, హెలీప్యాడ్లు.. ఎల్ఏసీ వద్ద చైనా భారీ ఎత్తున నిర్మాణాలు.. పెంటగాన్ సంచలన నివేదిక చైనా
    Joe Biden : గాజాపై దాడులు ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కు.. సంయుక్త ప్రకటన చేసిన అమెరికా సహా ప్రధాన దేశాలు ఇజ్రాయెల్
    అమెరికాలో అరాచకం..యువకుడు కొట్టడంతో వృద్ధ సిక్కు మృతి, ఖండించిన మేయర్ సిక్కు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025