LOADING...
Amit Shah: సిఎఎ ముస్లిం,మైనారిటీలకు వ్యతిరేకం కాదు.. వెనక్కితీసుకునే ప్రసక్తే లేదు: అమిత్ షా 
సిఎఎ ముస్లిం,మైనారిటీలకు వ్యతిరేకం కాదు.. వెనక్కితీసుకునే ప్రసక్తే లేదు: అమిత్ షా

Amit Shah: సిఎఎ ముస్లిం,మైనారిటీలకు వ్యతిరేకం కాదు.. వెనక్కితీసుకునే ప్రసక్తే లేదు: అమిత్ షా 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 14, 2024
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

పౌరసత్వ (సవరణ) చట్టం అమలులోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత, ఆ చట్టాన్ని ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రాలు CAAని నిరోధించలేవని, కేంద్రం మాత్రమే పౌరసత్వాన్ని అనుమతించగలదని కూడా షా అన్నారు. ఈ చట్టం అమలుపై అమిత్ షా మాట్లాడుతూ, " దేశంలోని మైనారిటీలు భయపడాల్సిన పని లేదని, ఎందుకంటే ఇది ఏ పౌరుడి హక్కులను వెనక్కి తీసుకోదని" ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుండి వచ్చిన హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీ సహా ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వాన్ని అందించడమే సీఏఏ లక్ష్యమని షా చెప్పారు.

Details 

ప్రతిపక్షాలన్నీ అబద్ధాల రాజకీయాలు చేస్తున్నాయి: అమిత్ షా 

సిఎఎ ద్వారా బిజెపి కొత్త ఓటు బ్యాంకును సృష్టిస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణపై, హోం మంత్రి మాట్లాడుతూ, "ప్రతిపక్షాలకు వేరే పని లేదని దుయ్యబట్టారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం కూడా మా రాజకీయ ప్రయోజనాల కోసమేనని వారు చెప్పారు. ఆర్టికల్ 370ని తొలగిస్తామని 1950 నుంచి చెబుతున్నామని అమిత్ షా చెప్పారు. సీఏఏ నోటిఫికేషన్ వెలువడే సమయంలో అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ సహా ప్రతిపక్షాలన్నీ అబద్ధాల రాజకీయాలు చేస్తున్నాయని షా అన్నారు. 2019లో సిఎఎ పార్లమెంటు ఆమోదం పొందింది కానీ కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలు చేయాలని, తమ ఓటు బ్యాంకును ఏకీకృతం చేసుకోవాలని కోరుకుంటున్నాయన్నారు.

Details 

అరవింద్ కేజ్రీవాల్‌పై అమిత్ షా మండిపాటు 

CAA అనేది ఈ దేశ చట్టమని దేశ ప్రజలకు తెలుసు. ఎన్నికల ముందు అమలు చేస్తామని గత నాలుగేళ్లలో 41 సార్లు చెప్పాను. ఢిల్లీ ముఖ్యమంత్రి,ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా షా మండిపడ్డారు.శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం వల్ల దొంగతనాలు,అత్యాచారాలు పెరుగుతాయని కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై ఆయన మాట్లాడుతూ..బంగ్లాదేశ్ చొరబాటుదారులు,రోహింగ్యాలు గురించి ఎందుకు మాట్లాడరు, వ్యతిరేకించరు అంటూ ప్రశ్నించారు. సిఎఎ నోటిఫికేషన్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యపై షా,"భాజపా అక్కడ(పశ్చిమ బెంగాల్)అధికారంలోకి వచ్చే రోజు ఎంతో దగ్గరలోనే ఉందని, చొరబాట్లను ఆపుతామని అన్నారు. మమతా బెనర్జీ ఇలాంటి బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ చొరబాట్లకు అనుమతిస్తే,జాతీయ భద్రతా సమస్య ఎదుర్కొంటుందని అప్పుడు ఆమెకు శరణార్థులకు మధ్య తేడా ఉండదని అన్నారు.

Advertisement

Details 

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ముందే సీఏఏ అమలు 

ANIతో మాట్లాడిన అమిత్ షా, ఇతర రాష్ట్రాల్లో CAA అమలు గురించి కూడా మాట్లాడారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తమ రాష్ట్రాల్లో CAAని అమలు చేయబోమని చెప్పడంపై షా, "మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 11 పార్లమెంటుకు పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలను రూపొందించే అన్ని అధికారాలను ఇస్తుంది" అని అన్నారు. ఇది కేంద్రానికి సంబంధించిన అంశం, రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదని, ఎన్నికల తర్వాత అందరూ సహకరిస్తారని భావిస్తున్నామని, బుజ్జగింపు రాజకీయాల కోసం దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పార్లమెంటులో ఆమోదం పొందిన ఐదేళ్ల తర్వాత కేంద్రం సోమవారం దాన్ని అమలులోకి తెచ్చింది. భారత ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించడానికి ముందే నోటిఫికేషన్ వెలువడింది.

Advertisement