NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amit Shah on POK: పీఓకే మనదే.. కాదనే ధైర్యం కాంగ్రెస్ కు ఉందా: అమిత్ షా 
    తదుపరి వార్తా కథనం
    Amit Shah on POK: పీఓకే మనదే.. కాదనే ధైర్యం కాంగ్రెస్ కు ఉందా: అమిత్ షా 
    పీఓకే మనదే.. కాదనే ధైర్యం కాంగ్రెస్ కు ఉందా: అమిత్ షా

    Amit Shah on POK: పీఓకే మనదే.. కాదనే ధైర్యం కాంగ్రెస్ కు ఉందా: అమిత్ షా 

    వ్రాసిన వారు Stalin
    May 15, 2024
    05:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)రగులుతోంది. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు.

    ఈ నేపథ్యంలో కేంద్రం హోం మంత్రి అమిత్ షా బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు.

    కాంగ్రెస్ పార్టీ పీఓకే మద్దతు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. పీఓకే భారత్‌లో అంతర్భాగమని, దానిని మేం తీసుకుంటామని అన్నారు.

    2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, ఒకప్పుడు సమస్యాత్మక ప్రాంతంగా ఉండే జమ్ముకశ్మీర్‌లో శాంతి నెలకొంటే, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మాత్రం ఇప్పుడు ఆజాదీ నినాదాలు, నిరసనలు ప్రతిధ్వనిస్తోందని పశ్చిమ బెంగాల్ సేరంపూర్‌లో జరిగిన ర్యాలీలో షా అన్నారు.

    Details 

     పాకిస్థాన్ వద్ద అణుబాంబులు.. అందుకే పీఓకే వదన్న ఇండియా కూటమి 

    ఇప్పుడు పీఓకేలో ప్రజలు రాళ్లు రువ్వతున్నారని చెప్పారు. ఇటీవల పీఓకేపై కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా మాట్లాడుతూ.. ''మణిశంకర్ అయ్యర్,నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా వంటి ఇండియా కూటమి నేతలు పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నందును పీఓకేని తీసుకోవద్దని చెప్పారు.

    అయితే, నేను పీఓకే భారత్‌లో భాగమే అని చెబుతున్నాను,దానిని భారత్ తిరిగి తీసుకుంటుంది''అని అన్నారు.

    ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అవినీతి నాయకులు ఉన్న ఇండియా కూటమికి, నిజాయితీ కలిగిన నరేంద్ర మోదీకి మధ్య జరుగుతున్నాయని,ఆయన ముఖ్యమంత్రిగా,ప్రధాన మంత్రిగా ఉన్న ఒక్క పైసా ఆరోపణ కూడా రాలేదని అమిత్ షా అన్నారు.

    Details 

    సీఏఏని వ్యతిరేకించి ఓటు బ్యాంకుని ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్న మమతా 

    చొరబాటుదారులు కావాలా..? లేక శరణార్ధులకు సీఏఏ కావాలా అనే దాన్ని బెంగాల్ నిర్ణయించుకోవాలని అన్నారు.

    జీహాద్‌కి ఓటేయాలా..? లేక వికాస్‌కి ఓటేయాలా..? అనే విషయాన్ని బెంగాల్ ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు.

    పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీఏఏని వ్యతిరేకించి తన ఓటు బ్యాంకుని ప్రసన్నం చేసుకోవాలని, చొరబాటుదారులకు మద్దతుగా ర్యాలీ చేపట్టిందని అమిత్ షా నిందించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    అమిత్ షా

    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ  జమిలి ఎన్నికలు
    Amit Shah: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్.. ఒక రోజు ముందుగానే హైదరాబాద్‌కు అమిత్ షా  తెలంగాణ
    హిందీ భారతదేశాన్ని ఏకం చేస్తుందని చెప్పడం అసంబద్ధం: అమిత్ షా హిందీ దివాస్ ప్రసంగంపై ఉదయనిధి ఉదయనిధి స్టాలిన్
    నితీష్,లాలూ పొత్తు చమురు నీరు వంటిదే, ఎక్కువ కాలం ఉండదు : అమిత్ షా బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025