Amit Shah on POK: పీఓకే మనదే.. కాదనే ధైర్యం కాంగ్రెస్ కు ఉందా: అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)రగులుతోంది. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రం హోం మంత్రి అమిత్ షా బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ పీఓకే మద్దతు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. పీఓకే భారత్లో అంతర్భాగమని, దానిని మేం తీసుకుంటామని అన్నారు.
2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, ఒకప్పుడు సమస్యాత్మక ప్రాంతంగా ఉండే జమ్ముకశ్మీర్లో శాంతి నెలకొంటే, పాక్ ఆక్రమిత కశ్మీర్లో మాత్రం ఇప్పుడు ఆజాదీ నినాదాలు, నిరసనలు ప్రతిధ్వనిస్తోందని పశ్చిమ బెంగాల్ సేరంపూర్లో జరిగిన ర్యాలీలో షా అన్నారు.
Details
పాకిస్థాన్ వద్ద అణుబాంబులు.. అందుకే పీఓకే వదన్న ఇండియా కూటమి
ఇప్పుడు పీఓకేలో ప్రజలు రాళ్లు రువ్వతున్నారని చెప్పారు. ఇటీవల పీఓకేపై కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా మాట్లాడుతూ.. ''మణిశంకర్ అయ్యర్,నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా వంటి ఇండియా కూటమి నేతలు పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నందును పీఓకేని తీసుకోవద్దని చెప్పారు.
అయితే, నేను పీఓకే భారత్లో భాగమే అని చెబుతున్నాను,దానిని భారత్ తిరిగి తీసుకుంటుంది''అని అన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అవినీతి నాయకులు ఉన్న ఇండియా కూటమికి, నిజాయితీ కలిగిన నరేంద్ర మోదీకి మధ్య జరుగుతున్నాయని,ఆయన ముఖ్యమంత్రిగా,ప్రధాన మంత్రిగా ఉన్న ఒక్క పైసా ఆరోపణ కూడా రాలేదని అమిత్ షా అన్నారు.
Details
సీఏఏని వ్యతిరేకించి ఓటు బ్యాంకుని ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్న మమతా
చొరబాటుదారులు కావాలా..? లేక శరణార్ధులకు సీఏఏ కావాలా అనే దాన్ని బెంగాల్ నిర్ణయించుకోవాలని అన్నారు.
జీహాద్కి ఓటేయాలా..? లేక వికాస్కి ఓటేయాలా..? అనే విషయాన్ని బెంగాల్ ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీఏఏని వ్యతిరేకించి తన ఓటు బ్యాంకుని ప్రసన్నం చేసుకోవాలని, చొరబాటుదారులకు మద్దతుగా ర్యాలీ చేపట్టిందని అమిత్ షా నిందించారు.