Page Loader
Amit Shah: మహాకుంభమేళ త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన అమిత్‌ షా.. 
మహాకుంభమేళ త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన అమిత్‌ షా..

Amit Shah: మహాకుంభమేళ త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన అమిత్‌ షా.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2025
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (మహా కుంభ్ 2025)లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి అధికారులతో సమావేశాలు నిర్వహించి మహాకుంభ్ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. మరోవైపు, అమిత్ షా పర్యటన నేపథ్యంలో నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కీలక కూడళ్లు, కార్యక్రమాల ప్రదేశాల్లో నిఘా పెంచారు. ఈ మహాకుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ప్రధాని ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మహాకుంభమేళాకు..

అలాగే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మహాకుంభమేళాకు హాజరు కావచ్చని సమాచారం. ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్రపతి ముర్ము మహాకుంభమేళాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించనున్నారు. సంక్రాంతి రోజున (జనవరి 13) ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ముగుస్తుంది. 45 రోజులపాటు కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తుల తాకిడి భారీగా ఉంది. ఇప్పటి వరకు 14 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ మహాకుంభమేళాలో పాల్గొనే భక్తుల సంఖ్య 50 కోట్లకు పైగా ఉండవచ్చని యూపీ సర్కారు అంచనా వేస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పుణ్యస్నానం ఆచరిస్తున్న  అమిత్‌ షా