NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నితీష్,లాలూ పొత్తు చమురు నీరు వంటిదే, ఎక్కువ కాలం ఉండదు : అమిత్ షా
    తదుపరి వార్తా కథనం
    నితీష్,లాలూ పొత్తు చమురు నీరు వంటిదే, ఎక్కువ కాలం ఉండదు : అమిత్ షా
    లాలూ, నితీష్ చమురు నీరు వంటివారు,ఎక్కువ కాలం కలిసుండలేరు : అమిత్ షా

    నితీష్,లాలూ పొత్తు చమురు నీరు వంటిదే, ఎక్కువ కాలం ఉండదు : అమిత్ షా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 16, 2023
    05:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బీహర్‌లో కేంద్రహోం మంత్రి అమిత్ షా శనివారం పర్యటించారు.

    సీఎం, మాజీ సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌ల పొత్తు చమురు, నీరు వంటిదని, ఎక్కువ కాలం కలిసుండలేదని జోస్యం చెప్పారు.

    ఝంజర్‌పూర్‌లో బహిరంగ సభలో మాట్లాడిన షా, బిహార్ వెనుకబాటుకు నితీష్‌, లాలూ ప్రసాద్‌ ఇద్దరూ బాధ్యులేనన్నారు.

    అవినీతిమయమైన యూపీఏ పేరు ఇష్టం లేకనే ఇండియా కూటమితో ప్రజల్ని మభ్యపెట్టేందుకు చూస్తున్నారన్నారు.

    దర్భంగా ఎయిమ్స్‌ను కేంద్రం రూ.1250కే ప్రతిపాదిస్తే, సీఎం నితీశ్ 81 ఎకరాల భూమిని ఇచ్చారని, తర్వాత వెనక్కి తీసుకున్నారని ఎద్దేవా చేశారు.

    మళ్లీ కొద్దిరోజులకు కేవలం 4 గుంటల స్థలాన్నే ఎయిమ్స్ కోసం ఇచ్చారని చురకలు అంటించారు.81 ఎకరాలను ఇచ్చి ఉంటే దర్భంగాలో వైద్య సేవలు అందేవన్నారు.

    details

    లాలూ జీ, యూపిఏ సర్కార్ మీకేమిచ్చింది : అమిత్ షా

    మరోవైపు బీహార్‌లో పర్యాటకానికి సంబంధించి కేంద్రం చేసిన అభివృద్ధి పనులను అమిత్ షా వెల్లడించారు.

    సీతామర్హి, బక్స్, దర్భంగాలను రామాయణ సర్క్యూట్‌లో చేర్చిన ప్రధాని మోదీ, పర్యాటకాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు.

    మిథిలా మఖానాకు కేంద్రమే జీఐ(GI) ట్యాగ్ చేసిందని షా పేర్కొన్నారు. రూ.125 కోట్లతో దర్భంగా, సక్రి, జయనగర్‌, సమస్తిపూర్‌ రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులను సైతం నిర్వహిస్తోందన్నారు.

    రూ.1200 కోట్లతో పాట్నా విమానాశ్రయ పునరాభివృద్ధిని చేపట్టామని అమిత్ షా స్పష్టం చేశారు.

    అటల్‌జీ ప్రారంభించిన కోసి మహాసేతును UPI పెండింగ్‌లో పెడితే, మోదీ సర్కార్ పూర్తి చేసిందని చెప్పుకొచ్చారు.

    పదేళ్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని, బీహార్‌కు ఏం ఇచ్చారని లాలూని నిలదీశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    బిహార్

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    అమిత్ షా

    'తమిళనాడులో పాలు సేకరించకుండా అమూల్‌ను నియంత్రిచండి': అమిత్ షాకు స్టాలిన్ లేఖ తమిళనాడు
    మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్ మణిపూర్
    మణిపూర్ ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం, ఉద్యోగాలు  మణిపూర్
    మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు 5 కీలక నిర్ణయాలు  మణిపూర్

    బిహార్

    జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం లాలూ ప్రసాద్ యాదవ్
    IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు లాలూ ప్రసాద్ యాదవ్
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు తేజస్వీ యాదవ్
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ నితీష్ కుమార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025