NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బిహార్: రేపు పాట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశానికి రంగం సిద్ధం
    తదుపరి వార్తా కథనం
    బిహార్: రేపు పాట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశానికి రంగం సిద్ధం
    రేపు పాట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశానికి రంగం సిద్ధం

    బిహార్: రేపు పాట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశానికి రంగం సిద్ధం

    వ్రాసిన వారు Stalin
    Jun 22, 2023
    05:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి దాదాపు 20 పార్టీలకు చెందిన ప్రతిపక్ష నాయకులు శుక్రవారం పాట్న వేదికగా సమావేశం కాబోతున్నారు.

    బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రతిపక్ష నాయకుల సమావేశం జరగనుంది.

    కేంద్రంలో బీజేపీని అధికారం నంచి దించే ఆశయ సాధనకు ఈ సమావేశం దోహదపడుతుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.

    పాట్నలో జరగనున్న ప్రతిపక్ష నాయకుల సమావేశం నేపథ్యంలో బీజేపీ నేతలకు కంటి మీద కునుకు ఉండదనే పలువురు అపోజిషన్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

    ప్రతిపక్షాల సమావేశానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, గురువారం నుంచి నేతలు పాట్నాకు చేరుకోవడం ప్రారంభిస్తారని బిహార్ జేడీ(యూ) నేత విజయ్ కుమార్ చౌదరి తెలిపారు.

     బిహార్

    మీటింగ్‌కి ఏ ఏ పార్టీ హాజరవుతోంది?

    కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం అధినేత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఎన్‌సీపీ నుంచి శరద్ పవార్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, జమ్ముకశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ప్రతిపక్ష నాయకుల సమావేశానికి హాజరుకానున్నారు.

    మెహబూబా ముఫ్తీ, కేజ్రీవాల్, భగవంత్ మాన్, మమతా బెనర్జీ గురువారం పాట్నాకు చేరుకునున్నారు.

    ఇదిలా ఉంటే, గురువారం సాయంత్రం బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌తో మమతా బెనర్జీ సమావేశం కానున్నారు.

    ముఖ్యమంత్రి నివాసంలో శుక్రవారం విపక్ష నేతల సమావేశం జరగనుంది.

    బిహార్

    బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాల పోస్టర్ యుద్ధం

    ప్రతిపక్షాల నాయకుల సమావేశానికి ముందు రాజకీయ వేడి రాజుకుంది.

    సమావేశానికి ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో విపక్షాల ఐక్యతను తెలియజేస్తూ ఓ పోస్టర్ వెలిసింది.

    బీజేపీని ఓడించాలనుకునే వారు ముందుకు రావాలని, 2024లో 80 సీట్లలో కాషాయ పార్టీని ఓడించాలని హిందీలో పోస్టర్‌పై రాసి ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ నియోజకవర్గాల ఉన్నాయి.

    అయితే ప్రతిపక్షాల పోస్టర్‌కు కౌంటర్‌గా పాట్నలోని బీజేపీ కార్యాలయం వెలుపల పోస్టర్ వెలిసింది.

    ప్రతిపక్షాల ఐక్యతను హేళన చేస్తూ బీజేపీ పోస్టర్లు ఏర్పాటు చేసింది.

    ప్రతిపక్ష నేతలంతా 'ఎటువంటి దార్శనికత లేకుండా' కలిసి వస్తున్నారని, పదవికోసం ఆరాటపడుతున్నారని పోస్టర్‌లో బీజేపీ ఎగతాళి చేసింది.

    పాట్నలో జరిగిన విపక్ష నేతల సమావేశాన్ని దిక్కుమాలినదిగా బీజీపీ అభివర్ణించడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్
    పాట్న
    కాంగ్రెస్
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    తాజా

    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ

    బిహార్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్ భారతదేశం
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు దిల్లీ

    పాట్న

    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర
    'వన్ ఆన్ వన్' వ్యూహం: 450లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్షాల నుంచి బీజేపీపై ఒక్కరే పోటీ  లోక్‌సభ
    పాట్నాలో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి కేసీఆర్‌ను ఆహ్వానించలేదు: తేజస్వీ యాదవ్ బిహార్

    కాంగ్రెస్

    కాంగ్రెస్ మేనిఫెస్టో: ఉచిత విద్యుత్, రూ.3వేల నిరుద్యోగ భృతి, కుటుంబ పెద్దకు రూ.2వేలు కర్ణాటక
    కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌ తప్పిన ప్రమాదం; హెలికాప్టర్ అత్యవసరల ల్యాండింగ్ కర్ణాటక
    నేడు హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ రాక: అమె 'పొలిటికల్ టూరిస్ట్' అంటూ కేటీఆర్ ఫైర్ ప్రియాంక గాంధీ
    సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం; ఈసీకి ఫిర్యాదు  కర్ణాటక

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు దిల్లీ
    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ
    పవర్ డిస్కమ్ బోర్డుల నుంచి ఆప్ నామినీలను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్ దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025