NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు
    తదుపరి వార్తా కథనం
    లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు
    లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు

    లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు

    వ్రాసిన వారు Stalin
    Apr 20, 2023
    01:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్ గురువారం లండన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అమృత్‌సర్ విమానాశ్రయంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అనంతరం అమెను అదుపులోకి తీసుకున్నారు.

    ప్రస్తుతం కిరణ్‌దీప్‌ను కస్టమ్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. కిరణ్‌దీప్‌కు యూకే పౌరసత్వం ఉంది. అమె యూకే పాస్‌పోర్ట్ హోల్డర్.

    ఆమెపై పంజాబ్‌లో లేదా దేశంలోని ఏ ప్రాంతంలోనూ కేసు నమోదు కాలేదు.

    అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్ యూకేలో ఉంటూ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌లో క్రియాశీలక సభ్యురాలిగా ఉన్నట్లు పంజాబ్ పోలీసులు లేదా కేంద్ర ఏజెన్సీల వద్ద కచ్చితమైన ఆధారాలు లేవు. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదు.

    పంజాబ్

    ఫిబ్రవరిలో కిరణ్‌దీప్ కౌర్‌- అమృత్‌పాల్ సింగ్ వివాహం

    పరారీలో ఉన్న నిందితుల కుటుంబం, పరిచయస్తులను ప్రశ్నించే చట్టపరమైన ప్రక్రియ కింద కిరణ్‌దీప్ కౌర్‌ను ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    మార్చిలో అమృత్‌పాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై ఆమెను జల్లుపూర్ ఖేడా గ్రామంలో ప్రశ్నించారు.

    అమృత్‌పాల్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో యూకేకు చెందిన ఎన్నారై కిరణ్‌దీప్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు.

    వివాహం జరిగిన తర్వాత కిరణ్‌దీప్ కౌర్ పంజాబ్‌కు వెళ్లి అమృత్‌పాల్ పూర్వీకుల గ్రామమైన జల్లుపూర్ ఖేడాలో నివసిస్తున్నారు. కిరణ్‌దీప్ కుటుంబ మూలాలు జలంధర్‌లో ఉన్నాయని చెబుతున్నారు.

    'వారిస్ పంజాబ్ దే' అధినేతగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలల తర్వాత అమృత్‌పాల్‌తో కిరణ్‌దీప్ వివాహం జరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్
    అమృత్‌సర్
    విమానాశ్రయం
    తాజా వార్తలు

    తాజా

    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు
    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా
    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు

    పంజాబ్

    ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన భారత్ ఆస్ట్రేలియా
    దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఎన్ఐఏ
    అమృతపాల్ సింగ్‌ అరెస్టుకు ఆపరేషన్ షురూ: ఇంటర్నెట్ బంద్; పంజాబ్‌లో ఉద్రిక్తత ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    అమృత్‌సర్

    అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట; పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన అతని మామ, డ్రైవర్ పంజాబ్
    'ఏకేఎఫ్' పేరుతో ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్‌ ప్రయత్నం; వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు పంజాబ్
    భార్యను అమృత్‌పాల్ సింగ్ తరుచూ కొట్టేవాడు, అమ్మాయిలపై మోజు, థాయ్‌లాండ్‌లో గర్లఫ్రెండ్: నిఘా వర్గాలు పంజాబ్
    పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్‌ వద్ద లొంగిపోవాలనుకున్నాడా? పంజాబ్

    విమానాశ్రయం

    కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    1.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది అరెస్ట్ ఎయిర్ ఇండియా
    ఇండిగో విమానం పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్; ప్రయాణికుడు మృతి పాకిస్థాన్
    భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ బెంగళూరు

    తాజా వార్తలు

    UPI: 2022లో భారత్‌లో 88బిలియన్ల యూపీఐ లావాదేవీలు; విలువ రూ.150 ట్రిలియన్లు భారతదేశం
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు
    అమెరికా దాడిలో ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ హతం సిరియా
    హర్యానా: రైస్‌మిల్లు కుప్పకూలి నలుగురు మృతి; 20మందికి గాయాలు హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025