NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Anakapalli : అప్పులబాధకు స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్య.. ప్రాణాల కోసం పోరాడుతున్న చిన్న కుమార్తె
    తదుపరి వార్తా కథనం
    Anakapalli : అప్పులబాధకు స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్య.. ప్రాణాల కోసం పోరాడుతున్న చిన్న కుమార్తె
    ప్రాణాల కోసం పోరాడుతున్న చిన్న కుమార్తె

    Anakapalli : అప్పులబాధకు స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్య.. ప్రాణాల కోసం పోరాడుతున్న చిన్న కుమార్తె

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 29, 2023
    12:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది.

    ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బలవన్మరణానికి యత్నించిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ కుటుంబం కొంతకాలంగా అనకాపల్లిలో నివసిస్తోంది.

    అప్పుల బాధను తట్టుకోలేక గురువారం రాత్రి కుటుంబమంతా సైనైడ్‌ తాగి బలవన్మరణానికి పాల్పడ్డట్లు స్థానికులు అంటున్నారు.

    ప్రస్తుతం జిల్లాలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రుణ బాధల కారణంగా తల్లితండ్రులు, పిల్లలతో పాటు ఆత్యహత్యకు ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోంది.

    DETAILS

    కుటుంబంతో కలిసి అనకాపల్లిలో నివాసం ఉంటున్న శివరామకృష్ణ 

    గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివ రామకృష్ణ, స్వర్ణకారుడు. ఈ వృత్తితోనే అనకాపల్లిలో కుటుంబాన్ని పోషిస్తున్నారు.

    ఈ క్రమంలోనే అప్పుల బాధను తట్టుకోలేక, గురువారం రాత్రి శివ రామకృష్ణతో పాటు ఆయన భార్య, ముగ్గురు ఆడపిల్లలు సైనైడ్ తాగినట్లు తెలుస్తోంది.

    విషప్రయోగంతో రామకృష్ణ, అతని భార్య మాధవి, కుమార్తెలు వైష్ణవి, లక్ష్మి మృతి చెందారు. మరో కుమార్తె కుసుమ ప్రియ(13) అనకాపల్లిలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతోంది.

    ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక సమస్యలతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు అంటున్నారు.

    శివరామకృష్ణ (40),మాధవి (38), కుమార్తెలు వైష్ణవి(16),లక్ష్మి(13)లు మృతి చెందారు.

    ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా

    ఆంధ్రప్రదేశ్

    Srikakulam: బ్యాంకులో 7కేజీల బంగారం మాయం.. గోల్డ్ కస్టోడియన్ బ్యాంక్ మహిళా అధికారి ఆత్మహత్య  శ్రీకాకుళం
    Cyclone Michaung: కోస్తాంధ్ర వైపు ముంచుకొస్తున్న 'మైచాంగ్' తుపాను.. ఏపీకి ఐఎండీ రెడ్ అలర్ట్    తుపాను
    Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు  ఎన్నికల సంఘం
    తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్‌.. ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా?  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025