NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh : ఏపీలో రేపటి నుంచి కులగణన.. ఇంటింటి సర్వేకు శ్రీకారం
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh : ఏపీలో రేపటి నుంచి కులగణన.. ఇంటింటి సర్వేకు శ్రీకారం
    Andhra Pradesh : ఏపీలో రేపటి నుంచి కుల గణన ప్రక్రియ ప్రారంభం

    Andhra Pradesh : ఏపీలో రేపటి నుంచి కులగణన.. ఇంటింటి సర్వేకు శ్రీకారం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 14, 2023
    01:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం మేరకు కులగణన ప్రక్రియకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు నవంబర్ 15న, ప్రారంభం కానుంది.

    ఈ క్రమంలోనే రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా కులగణన జరగనుంది. ఇదే సమయంలో ఏపీలో సమగ్ర కులగణన కోసం గత ఎనిమిది నెలలుగా ఏపీ ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది.

    దీంతో ఆరుగురు అధికారులతో కూడిన కమిటీ దేశంలో కులగణన చేపట్టిన రాష్ట్రాల్లో ఇటీవలే పర్యటించారు. కులగణేన అంశంలో వచ్చే న్యాయపరమైన ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్నారు.

    అనంతరం ఆయా విషయాలను క్రోడీకరించి కులగణన ఎలా చేపట్టాలి, ఏ సమాచారం తీసుకోవాలన్న అంశం మేరకు సదరు కమిటీ, ఇప్పటికే సర్కారుకు రిపోర్టు సమర్పించింది.

    details

    కోటి 60 లక్షల కుటుంబాలకు సర్వే

    తాజాగా ఈ నివేదిక ఆధారంగానే రాష్ట్రంలోని కోటి 60 లక్షల కుటుంబాలను ప్రభుత్వం సర్వే చేయనుంది.

    ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కులగణన ప్రక్రియ మొదలుకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ కులగణనను ప్రారంభించనున్నారు.

    ఇంటింటికి, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వెళ్లి డేటా సేకరించనున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ స్పెషల్ యాప్ తీసుకొచ్చింది.

    ఈ డాటా మొత్తాన్ని డిజిటల్ పద్ధతిలో యాప్ లోనే క్రోడీకరిస్తారు. నవంబర్ 15న మూడు గ్రామ సచివాలయాలు, రెండు వార్డు సచివాలయాల పరిధిలో ప్రారంభం కానుంది.

    details

    ఈనెల 17న రాజమహేంద్రవరం, కర్నూలులో సర్వే

    ఈ మేరకు కులగణన ప్రక్రియను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పర్యవేక్షించనున్నారు. ఈనెల 22 వరకు కులగణన ప్రక్రియపై శిక్షణ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

    కులగణనపై ఐదు పట్టణాల్లో ప్రాంతీయ సదస్సులు సైతం నిర్వహించనున్నారు. రేపటి నుంచి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగనున్నాయి.

    దీనికి సంబంధించి ప్రాంతీయ సదస్సులను ఈనెల 17న రాజమహేంద్రవరం, కర్నూలులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    వీటితో పాటు ఈ నెల 20న విశాఖపట్నం, విజయవాడలో, 24న తిరుపతిలోనూ నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    ఆంధ్రప్రదేశ్

    వచ్చే ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు రాకపోవచ్చు: సీఎం జగన్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    అమరరాజా నుంచి లూలూ దాకా.. ఏపీ నుంచి తెలంగాణకు మళ్లిన పెట్టుబడుల వెల్లువ భారతదేశం
    Nara Lokesh : ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు  ఎన్ఐఏ

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది? ఆంధ్రప్రదేశ్
    మణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్
    విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025