NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: పింఛన్ దారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. బదిలీ చేసుకోవాలనుకునేవారికి ఛాన్స్
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: పింఛన్ దారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. బదిలీ చేసుకోవాలనుకునేవారికి ఛాన్స్
    పింఛన్ దారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్

    Andhrapradesh: పింఛన్ దారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. బదిలీ చేసుకోవాలనుకునేవారికి ఛాన్స్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 04, 2024
    11:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పింఛన్లకు సంబంధించిన కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది.

    తాజాగా పింఛన్లు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేసుకునే అవకాశాన్ని అందించినట్లు తెలిపారు.

    దీనికి సంబంధించి, ప్రస్తుతం పింఛన్ తీసుకుంటున్న సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    పింఛన్ బదిలీకి దరఖాస్తు చేసేటప్పుడు, పింఛన్ ఐడీ, బదిలీ చేయాలనుకునే ప్రాంతానికి సంబంధించిన జిల్లా, మండలం, సచివాలయం పేరు,అలాగే ఆధార్ జిరాక్స్ అవసరం అవుతుంది.

    ఈ సదుపాయం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. స్వగ్రామాలకు రాలేని పింఛన్ గ్రాహకులు తమ ప్రస్తుత నివాస ప్రాంతానికి బదిలీ చేసుకోవడం ద్వారా పింఛన్ల పంపిణీకి సహాయపడుతుంది.

    ఈ ఆప్షన్ ప్రతినెలా అందుబాటులో ఉంటుందని, దీన్ని ఉపయోగించుకోవడం వల్ల స్వగ్రామాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉంటుంది.

    వివరాలు 

     ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ 

    ఈ నెల పింఛన్ల పంపిణీ ఒక్కరోజు ముందుగానే ప్రారంభించారు. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన పంపిణీ జరుగుతుంటుంది, కానీ సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో, ప్రభుత్వం పింఛన్ల పంపిణీని ఒకరోజు ముందుగానే చేపట్టింది.

    ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులు,సచివాలయ ఉద్యోగులకు సెలవు కావడంతో, పింఛన్ల పంపిణీ నిర్వహించారు.

    అయితే శనివారం తీవ్ర వర్షాలు కారణంగా కొంత వెసులుబాటు చోటుచేసుకుంది.

    ఈ నెలలో వర్షాల వల్ల కొన్ని ప్రాంతాలలో పింఛన్ల పంపిణీ చేయలేకపోయినట్లు తెలుస్తోంది.

    ముఖ్యంగా విజయవాడ వంటి ప్రాంతాల్లో వరదల కారణంగా పింఛన్ల పంపిణీ నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

    వీరికి వచ్చే నెలలో కలిపి పింఛన్ ఇస్తారా.. ఈ నెలలోనే అందిస్తారా అన్నది క్లారిటీ లేదు. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    ఆంధ్రప్రదేశ్

    Digital Payments: పట్టణ స్థానిక సంస్థల్లో డిజిటల్ విధానం.. త్వరలోనే అమల్లోకి! ఇండియా
    Pawan Kalyan : గ్రామ సభల నిర్వహణపై అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు పవన్ కళ్యాణ్
    Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ విచారణకు ప్రభుత్వ అనుమతి.. గెజిట్‌ విడుదల  భారతదేశం
    Atchutapuram SEZ explosion: అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు..17మంది మృతి.. 60 మందికి తీవ్ర గాయాలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025