NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra News: రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న సీ ప్లేన్‌ సేవలు.. డీపీఆర్‌ల తయారీకి అనుమతులు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra News: రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న సీ ప్లేన్‌ సేవలు.. డీపీఆర్‌ల తయారీకి అనుమతులు
    రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న సీ ప్లేన్‌ సేవలు.. డీపీఆర్‌ల తయారీకి అనుమతులు

    Andhra News: రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న సీ ప్లేన్‌ సేవలు.. డీపీఆర్‌ల తయారీకి అనుమతులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 26, 2025
    09:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విమానాశ్రయంలో రన్‌వేపై నుంచి వేగంగా పరుగెత్తి,ఆపై దూరంలోని జలాశయం వద్ద నీటిపై తేలుతూ ఆకాశంలోకి మళ్లీ ఎగిరిపోతూ ప్రయాణికులను ఆకట్టుకునే సీ ప్లేన్‌ సర్వీసులు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి.

    పర్యాటక అభివృద్ధికి బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సేవల కోసం రాష్ట్రంలోని 11 ప్రదేశాలను ఎంపిక చేసింది.

    ఈ లొకేషన్లలో ఎనిమిది ప్రాంతాలకుగాను టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీ(సాంకేతిక సాధ్యతా నివేదిక), డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్‌)తయారీ కోసం టెండర్లను ఆహ్వానించారు.

    మొదటి దశగా ప్రకాశం బ్యారేజి (అమరావతి),కళ్యాణి డ్యాం(తిరుపతి),గండికోటల నుంచి సేవలు ప్రారంభించేందుకు డీపీఆర్‌లు రూపొందించాలని నిర్ణయించారు.

    ఇందులో అమరావతి,గండికోట ప్రాంతాల డీపీఆర్‌ల బాధ్యత రైట్స్‌ సంస్థకు అప్పగించగా,తిరుపతి ప్రాంతానికి సంబంధించిన బాధ్యతలు ఫీడ్‌బ్యాక్‌ హైవేస్‌ సంస్థకు అప్పగించారు.

    వివరాలు 

    దేశవ్యాప్తంగా 56 మార్గాల్లో సీ ప్లేన్‌ సేవలు

    ఈ ప్రదేశాల నుంచి సేవలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపిన సంస్థలతో అధికారులు ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు.

    ఇక దేశవ్యాప్తంగా 56 మార్గాల్లో సీ ప్లేన్‌ సేవలు కల్పించేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (మోకా - MoCA) బిడ్లను ఆహ్వానించింది.

    ఆంధ్రప్రదేశ్‌లో ఎంపికైన 11 లొకేషన్లలో కొన్ని ప్రాంతాలకు ఒక్కటిపైగా దారులుండటంతో మొత్తం 32 మార్గాలను గుర్తించారు.

    ఉదాహరణకు ప్రకాశం బ్యారేజి,గండికోట,తిరుపతి లొకేషన్లను బేస్‌గా తీసుకొని,రాకపోకలతో కలిపి ఆరు మార్గాలుగా లెక్కించారు.

    ఈ సేవల నిర్వహణపై స్పైస్‌జెట్,ఎయిర్‌ ఏషియా వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ఆసక్తి చూపాయి.

    ప్రస్తుతం ఈ మార్గాల కేటాయింపు కోసం కేంద్రం పరిశీలనలు చేపట్టింది.

    వివరాలు 

    మొదట్లో మూడు మార్గాలకే ఎందుకు ప్రాధాన్యం? 

    యుడాన్‌ (UDAN) పథకం కింద ఉండే సబ్సిడీలు,ఇతర సౌకర్యాలు కూడా ఈ సీ ప్లేన్‌ సేవలకూ వర్తించనున్నాయి.

    ప్రభుత్వం తొలి దశలో ప్రారంభించబోయే మూడు మార్గాల పరిసరాల్లోనే ఇప్పటికే విమానాశ్రయాలు ఉన్నందున, సాంప్రదాయ విమానాల సేవలతోపాటు సీ ప్లేన్‌ ప్రయాణాలను కూడా కలిపి అమలు చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.

    ఉదాహరణకు, గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రయాణికులను ప్రకాశం బ్యారేజి వద్ద ఏర్పాటు చేయనున్న వాటర్ డ్రోమ్‌కు తీసుకెళ్లేలా సర్వీసు నడిపే యోచన ఉంది.

    అక్కడ ప్రయాణికులు కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత శ్రీశైలానికి వెళ్లేలా సదుపాయం కల్పించనున్నారు.

    వివరాలు 

    ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు: 

    మారుమూల ప్రాంతాలకు విమాన సేవలను విస్తరించడం

    రన్‌వేలు లేని ప్రాంతాల్లో విమానయాన సౌకర్యాలను మెరుగుపరచడం

    విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన ఖర్చుతో పోలిస్తే తక్కువ వ్యయంతో, తక్కువ సమయంలో వాటర్‌ డ్రోమ్‌లు అభివృద్ధి చేసే అవకాశం

    పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలను పెంచడం

    వివరాలు 

    విజయవంతమైన ప్రయోగాత్మక ప్రయాణం

    గత ఏడాది నవంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం బ్యారేజి వద్ద పున్నమి ఘాట్‌ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్‌ను ప్రయోగాత్మకంగా నడిపించింది.

    దాదాపు 150 కిలోమీటర్ల ఈ ప్రయాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు,పలువురు అధికారులు పాల్గొన్నారు.

    ఈ ప్రయోగం విజయవంతం కావడంతో రాష్ట్రంలో సేవల ప్రారంభానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

    సీ ప్లేన్‌ భూమికి సుమారు 1,500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో ప్రకృతి అందాలను దగ్గరగా ఆస్వాదించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Andhra News: రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న సీ ప్లేన్‌ సేవలు.. డీపీఆర్‌ల తయారీకి అనుమతులు ఆంధ్రప్రదేశ్
    Karnataka:18 మంది బీజేపీ శాసనసభ్యుల సస్పెన్షన్‌ ఎత్తివేత.. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఉత్తర్వులు..!   కర్ణాటక
     Shehbaz Sharif-Erdogan: టర్కీ అధ్యక్షుడితో పాకిస్తాన్ ప్రధాని తొలి సమావేశం..  పాకిస్థాన్
    Gang rape: మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా దారుణ ఘటన.. గిరిజన మహిళపై కామాంధుల హత్యాచారం  మధ్యప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    Kolusu Parthasarathy: లబ్ధిదారులకు ఇబ్బంది రాకుండా పింఛన్లు పంపిణీ  భారతదేశం
    Maternity Leave: మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. మెటర్నిటీ లీవ్స్‌ పెంచుతూ నిర్ణయం  భారతదేశం
    Sujana Chowdary: లండన్ పర్యటనలో బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయం బీజేపీ
    AP Rains: రాష్ట్రవ్యాప్తంగా వర్షాల ముప్పు.. నేడు, రేపు భారీ వానలు భారీ వర్షాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025