NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapadesh: రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం.. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు
    తదుపరి వార్తా కథనం
    Andhrapadesh: రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం.. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు
    రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం

    Andhrapadesh: రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం.. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 19, 2024
    09:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది.

    బుధవారం మంత్రివర్గ సమావేశంలో సంబంధిత దస్త్రాన్ని ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

    రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం పై తీర్మానం చేయడానికి, కేంద్రానికి నివేదించడానికి ప్రణాళికలు ఉన్నాయి.

    2014-19 మధ్య అమలైన ఎన్టీఆర్‌ విదేశీవిద్య,విద్యోన్నతి పథకాలను పునరుద్ధరించాలనే ఆదేశాలు కూడా జారీ చేశారు.

    ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలకు ఎక్కువ ప్రయోజనం చేకూరేలా పథక నిబంధనల్లో మార్పులు చేయాలని సూచించారు.

    26 జిల్లాల్లో బీసీ భవనాల నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని, బీసీ స్టడీసర్కిళ్ల బలోపేతానికి రూ.10 కోట్లు విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.

    అలాగే, వందమంది అభ్యర్థులతో ఐఏఎస్‌ స్టడీసర్కిల్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.

    వివరాలు 

    56 బీసీ కార్పొరేషన్లను పునర్నిర్మాణం 

    బీసీ కార్పొరేషన్ల పునర్నిర్మాణం గురించి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

    139 కులాలవారికి లబ్ధి అందేలా 56 బీసీ కార్పొరేషన్లను పునర్నిర్మించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

    ఈ కార్పొరేషన్ల ద్వారా బీసీల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని, కులాలు మరియు ఉపకులాల ఆధారంగా ఉండాలని సూచించారు.

    నేషనల్ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నుంచి రూ.100 కోట్ల రాయితీ రుణాలు పొందేందుకు, రాష్ట్రం నుండి రూ.38 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు.

    గురుకుల విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న డైట్‌ ఛార్జీలు,కాస్మొటిక్‌ ఛార్జీల చెల్లింపులు త్వరగా చేయాలని,వసతి గృహాల మరమ్మతులకు, విద్యార్థుల సామగ్రి కోసం సుమారు రూ.35 కోట్లు విడుదల చేయాలని సూచించారు.

    వివరాలు 

    అసంపూర్తిగా ఉన్న బీసీ భవనాల నిర్మాణానికి రూ.8 కోట్లు విడుదల 

    విద్యార్థుల నైపుణ్యాల మెరుగుదలకు శంకరన్‌ రిసోర్స్‌ సెంటర్ల తరహాలో ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.

    అలాగే, 2014-19 మధ్య ప్రారంభమైన,అసంపూర్తిగా ఉన్న బీసీ భవనాల నిర్మాణానికి రూ.8 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు.

    ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల్లోని బీపీఎల్‌ కుటుంబాల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

    2014-19 మధ్య మంజూరు చేసిన 68 కాపు భవనాల పూర్తి కోసం కూడా చర్యలు తీసుకోవాలని, ఇందులో పూర్తికాని రెండు భవనాల నిర్మాణానికి రూ.2.36 కోట్లు విడుదల చేయాలని సూచించారు.

    వివరాలు 

    ఆర్టీజీఎస్‌తో గురుకులాల అనుసంధానం: మంత్రి సవిత 

    రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని ఆర్టీజీఎస్‌తో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.

    ఆమె మంగళవారం సచివాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ''ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నాలుగు గురుకులాల భవనాల నిర్మాణం పూర్తిచేసేందుకు రూ.75 కోట్లు మంజూరు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాం. బీసీలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ప్రత్యేక కార్యక్రమం చేపడతాం. బీసీ-ఏలోని అత్యంత వెనుకబడిన వర్గాలను సహాయపడేందుకు సీడ్‌ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. అలాగే, చేతివృత్తుల వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ పథకాన్ని అమలు చేస్తాం'' అని మంత్రి వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    ఆంధ్రప్రదేశ్

    #Newsbytesexplainer: ప్ర‌కృతి వైప‌రీత్య‌మా.. మానవా తప్పిదామా.. ఎవరిది నేరం..? వరదలు
    Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల ముప్పు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక  ఇండియా
    AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో మరో 3 రోజులు భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్  భారతదేశం
    Andhrapradesh: పింఛన్ దారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. బదిలీ చేసుకోవాలనుకునేవారికి ఛాన్స్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025