NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: కౌలు రైతులకూ 'అన్నదాత సుఖీభవ'.. 20వ తేదీలోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలన్న ప్రభుత్వం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: కౌలు రైతులకూ 'అన్నదాత సుఖీభవ'.. 20వ తేదీలోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలన్న ప్రభుత్వం 
    కౌలు రైతులకూ 'అన్నదాత సుఖీభవ'..

    Andhrapradesh: కౌలు రైతులకూ 'అన్నదాత సుఖీభవ'.. 20వ తేదీలోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలన్న ప్రభుత్వం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 05, 2025
    09:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇప్పటి వరకు సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే వర్తించేలా ఉన్న 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని, ఈసారి కౌలు రైతులకూ విస్తరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

    ఈ పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి మొత్తం రూ.20 వేలు మూడు విడతలుగా అందించనుంది.

    ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 'పీఎం కిసాన్‌' పథకంలో భాగంగా వచ్చే రూ.6 వేలు కూడా ఈ మొత్తంలో కలిపి జమ చేయనుంది.

    అటవీ భూములపై హక్కులు కలిగిన (ROFR) లబ్ధిదారులనూ అర్హులుగా గుర్తించనున్నారు.

    రైతులకు ఈ పథకం కింద ప్రయోజనం అందించేందుకు,వ్యవసాయ,ఉద్యానవన,పట్టు శాఖ సహాయకులు,తహసీల్దార్లు,మండల వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని అర్హులైన రైతుల వివరాలను పరిశీలించి ధృవీకరించాలి.

    వివరాలు 

    కుటుంబ యూనిట్‌ ఆధారంగా సాయం 

    ఆ తరువాత వీరి వివరాలను ఈ నెల 20వ తేదీలోగా 'అన్నదాత సుఖీభవ' అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సిందిగా సూచన ఇచ్చింది.

    ఈ మేరకు వ్యవసాయశాఖ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది.

    ఈ పథకాన్ని ఒక కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణిస్తూ అమలు చేయనున్నారు.

    భర్త, భార్య, పెళ్లి కాని పిల్లలు కలిసిన కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటారు.

    అయితే, పిల్లలు వివాహం చేసుకుని వేరుగా ఉంటే, వారికి వేరుగా ప్రత్యేక యూనిట్‌గా పరిగణించి పథకం ప్రయోజనాలు అందిస్తారు.

    వ్యవసాయ, ఉద్యాన, పట్టు పంటలు సాగు చేసే రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.

    వివరాలు 

    అర్హులు కానివారి వివరాలు 

    ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులకు ఈ పథకం వర్తించదు.ప్రస్తుత,మాజీ లోక్‌సభ,రాజ్యసభ సభ్యులు,శాసనసభ్యులు,మంత్రులు,శాసనమండలి సభ్యులు,మేయర్లు,జడ్పీ చైర్‌పర్సన్లు వంటి రాజ్యాంగ బద్ధ పదవులను నిర్వహిస్తున్నవారు,నిర్వహించినవారు అర్హులు కాదు.

    కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మంత్రిత్వ శాఖలు,శాఖల కార్యాలయాల్లో,ప్రభుత్వ రంగ సంస్థలలో,స్థానిక సంస్థలలో శాశ్వత ఉద్యోగంగా పని చేస్తున్నవారూ ఈ పథకం కింద సాయం పొందలేరు.

    తదుపరి,నెలకు రూ.10వేలు లేదా అంతకన్నా ఎక్కువ పెన్షన్‌ తీసుకునే వారికి కూడా పథకం వర్తించదు.

    అయితే,మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌,క్లాస్‌-4, గ్రూప్‌-డి ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఉంది.

    వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, ఛార్టెడ్‌ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు, అలాగే ఇతర నమోదిత వృత్తి నిపుణులూ ఈ పథకం లబ్ధిదారులు కావడానికి అర్హులు కారు.

    అంతేకాదు,గత సంవత్సరం ఆదాయపు పన్ను చెల్లించినవారూ ఈ పథకానికి అనర్హులుగా పరిగణించబడతారు.

    వివరాలు 

    'పీఎం కిసాన్‌' అమలులో మెరుగులు 

    వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్చిన వారికీ ఈ పథకం వర్తించదు.

    'పీఎం కిసాన్‌' పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికీ, లబ్ధిదారుల వివరాలను నవీకరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సూచించింది.

    ఈ మేరకు మే నెలాఖరులోగా జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించింది.

    ఇప్పటికే మరణించిన లబ్ధిదారుల పేర్లను తొలగించడం, భూ రికార్డులకు అనుగుణంగా లబ్ధిదారుల నమోదు, రైతుల ఐడీ నంబర్లు, పెండింగ్‌లో ఉన్న ఆధార్‌, ఈకేవైసీ వివరాల సవరణ వంటి పనులను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

    అటవీ హక్కుల చట్టం కింద హక్కులు పొందిన గిరిజనులకు, అలాగే ప్రత్యేకంగా గుర్తించబడిన అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాలకు (PVTGs) చెందిన అర్హుల ఎంపిక కోసం గిరిజనశాఖతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వ శాఖ సూచించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: ఏపీకి భారీగా పెట్టుబడులు.. శ్రీసిటీలో ఎల్‌జీ మెగా ప్లాంట్! నెల్లూరు నగరం
    AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. భేటీలో పలు కీలక నిర్ణయాలు భారతదేశం
    Andhra Pradesh: TCSకు 21.6 ఎకరాల భూమి కేటాయించిన ఎపి ప్రభుత్వం  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
    Election Commission: ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. మే 9న పోలింగ్! ఎన్నికల సంఘం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025