NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amaravathi: రాజధానిలో మరో రూ. 24,276 కోట్ల పనులకు ఆమోదం.. 3 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    Amaravathi: రాజధానిలో మరో రూ. 24,276 కోట్ల పనులకు ఆమోదం.. 3 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం
    రాజధానిలో మరో రూ. 24,276 కోట్ల పనులకు ఆమోదం.. 3 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం

    Amaravathi: రాజధానిలో మరో రూ. 24,276 కోట్ల పనులకు ఆమోదం.. 3 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 17, 2024
    08:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ. 24,276.83 కోట్ల విలువైన కొత్త పనులకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 43వ సీఆర్‌డీఏ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు అనుమతి లభించింది.

    ప్రధాన రహదారులు, ఎల్‌పీఎస్ లేఅవుట్‌లలో మౌలిక వసతుల కల్పనతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల నిర్మాణాలకు ఈ సమావేశంలో ఆమోదం ప్రకటించారు.

    ఇప్పటి వరకు మొత్తం రూ. 45,249.24 కోట్ల పనులకు అనుమతులు లభించాయి.

    మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా టెండర్లు పిలుస్తామని, మొత్తం మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి రూ. 62,000 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు.

    టెండర్ల ప్రక్రియ మూడు రోజుల్లో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

    వివరాలు 

    అసెంబ్లీ భవనం కోసం 103 ఎకరాల స్థలం

    అసెంబ్లీ భవనం కోసం 103 ఎకరాల స్థలంలో 11.22 లక్షల చదరపు అడుగుల నిర్మాణం జరగనుంది.

    250 మీటర్ల ఎత్తుతో నిర్మించే ఈ భవనానికి రూ. 765 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అసెంబ్లీ సమావేశాలు ఏడాదిలో 40-50 రోజులే నిర్వహిస్తారు.

    మిగతా రోజుల్లో ప్రజలకు టవర్‌ పైకి వెళ్లి అమరావతి నగరాన్ని వీక్షించే అవకాశం కల్పిస్తారు.హైకోర్టు భవనాన్ని 42 ఎకరాల్లో,55 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్నారు.

    మొత్తం 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ భవనానికి రూ. 1,048 కోట్లు ఖర్చు అవుతుంది.

    సచివాలయం,విభాగాధిపతుల కార్యాలయాలు ఐదు ఐకానిక్‌ టవర్లుగా రూపుదిద్దుకోనున్నాయి.

    ముఖ్యమంత్రి కార్యాలయం టవర్‌ను బేస్‌మెంట్‌+గ్రౌండ్‌+47 అంతస్తులుగా నిర్మించనున్నారు.

    వివరాలు 

    ఐదు ఎల్‌పీఎస్ జోన్లలో 90 ఎంఎల్‌డీ సామర్థ్యంగల మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు

    ఇందులో మొత్తం నిర్మాణ విస్తీర్ణం 17,03,433 చదరపు అడుగులు కాగా, మొత్తం ఐదు టవర్లకు 68,88,064 చదరపు అడుగుల నిర్మాణం జరగనుంది. ఇందుకు రూ. 4,688 కోట్లు వ్యయం కానుంది.

    ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌లలో 579.5 కి.మీ. పొడవైన రహదారుల నిర్మాణానికి రూ. 9,699 కోట్లు ఖర్చు అవుతుందని అథారిటీ వెల్లడించింది.

    ఇందులో 360 కి.మీ. ప్రధాన రహదారుల నిర్మాణం ఉండగా, 151.9 కి.మీ. రహదారుల పనులు రూ. 7,794 కోట్ల వ్యయంతో చేపడతారు.

    అదనంగా ఐదు ఎల్‌పీఎస్ జోన్లలో 90 ఎంఎల్‌డీ సామర్థ్యంగల మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు రూ. 318.15 కోట్లతో అనుమతి లభించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి
    చంద్రబాబు నాయుడు

    తాజా

    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్
    Motivational: భయంతో ఉన్న మనస్సు విఫలమవుతుంది… భయాన్ని అధిగమించేందుకు ప్రేరణ కలిగించే 5 పాయింట్స్ ఇవే..  జీవనశైలి
    Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌! టాలీవుడ్
    UAE Golden Visa: UAE గోల్డెన్ వీసా అంటే ఏమిటి? భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

    అమరావతి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: భారీ వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు భారతదేశం
    CM Chandrababu: ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు.. ఆరు కొత్త ఇండస్ట్రియల్ పాలసీలకు ఆమోదం భారతదేశం
    CM Chandrababu: భారీ వర్షాల నేపథ్యంలో.. ఆయా శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష.. భారీ వర్షాలు
    Chandra babu: అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించిన చంద్రబాబు  అమరావతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025