NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఉద్యోగులపై ఏపీ సర్కార్ వరాల జల్లు.. సీపీఎస్ స్థానంలో జీపీఎస్
    తదుపరి వార్తా కథనం
    ఉద్యోగులపై ఏపీ సర్కార్ వరాల జల్లు.. సీపీఎస్ స్థానంలో జీపీఎస్
    ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023కు ఆమోదం

    ఉద్యోగులపై ఏపీ సర్కార్ వరాల జల్లు.. సీపీఎస్ స్థానంలో జీపీఎస్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 07, 2023
    04:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగుల సంక్షేమం కోసం కొత్త పెన్షన్ విధానాన్ని తేనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నూతన ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనను కేబినెట్ ఆమోదించింది.

    సీపీఎస్ ఉద్యోగుల కోసం ఏపీ జీపీఎస్ బిల్లు తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. "ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023" పేరిట రాష్ట్రంలో కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

    ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీ కేబినెట్‌ భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల కోసం క్రమబద్ధీకరణ చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రి వర్గం, 12వ పీఆర్సీ ఏర్పాటుకు సైతం అంగీకరించింది.

    Ap Cabinet Taken Key Decisions For Welfare Of The State

    పౌరసరఫరాల శాఖకు రూ.5 వేల కోట్ల రుణ సేకరణకు పర్మిషన్

    18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను బిగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రి వర్గం. ఇందుకోసం దాదాపుగా రూ. 6, 888 కోట్లను ఖర్చు చేసేందుకు సర్కారు సిద్ధమైంది.

    అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కనెక్షన్ కోసం రూ. 445 కోట్ల రుణాలు తీసుకువచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జగనన్న అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28న తల్లిదండ్రుల ఖాతాల్లో వేయనున్నట్లు సమాచారం.

    రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నూతన వైద్యకళాశాలల్లో 706 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. చిత్తూరు డెయిరీ ప్లాంట్‌కు 28 ఎకరాల భూమిని లీజు రూపంలో ఇచ్చేందుకు అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల కార్పొరేషన్‌ ద్వారా రూ.5 వేల కోట్ల రుణ సేకరణకు అనుమతించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ప్రభుత్వం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఆంధ్రప్రదేశ్

    పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్  కూరగాయలు
    మణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తాజా వార్తలు
    విశాఖ చరిత్ర తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి విశాఖపట్టణం
    ఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు తుపాను

    ప్రభుత్వం

    మలావిలోని ఫ్రెడ్డీ తుఫానులో 225 మంది మరణం ప్రపంచం
    ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం ప్రకటన
    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ఫీచర్
    గందరగోళం మధ్య ఆర్థిక బిల్లు 2023ను ఆమోదించిన లోక్‌సభ లోక్‌సభ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025