NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: వరద ప్రాంతాలలో కరెంటు బిల్లులపై కీలక ప్రకటన చేసిన చంద్రబాబు 
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: వరద ప్రాంతాలలో కరెంటు బిల్లులపై కీలక ప్రకటన చేసిన చంద్రబాబు 
    వరద ప్రాంతాలలో కరెంటు బిల్లులపై కీలక ప్రకటన చేసిన చంద్రబాబు

    Chandrababu: వరద ప్రాంతాలలో కరెంటు బిల్లులపై కీలక ప్రకటన చేసిన చంద్రబాబు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 06, 2024
    12:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాలలో కరెంటు బిల్లుల వసూళ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.

    ఆయన, వరద ప్రభావిత ప్రాంతాల్లో కరెంటు బిల్లుల వసూలు వాయిదా వేయాలని నిర్ణయించామన్నారు.

    వరద వల్ల నష్టపోయిన వస్తువుల మరమ్మత్తుకు సరైన ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు.

    వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గ్యాస్‌ స్టవ్‌ల మరమ్మత్తుల కోసం కూడా ప్రభుత్వమే ఒక ధర నిర్ణయిస్తుందని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఇటువంటి సేవలు అందించేవారితో కూడా మాట్లాడుతున్నట్లు చెప్పారు.

    వివరాలు 

    వరద బాధితులకు కిట్లు 

    నేటి నుండి మూడు రోజులు, రోజుకు 80,000 మందికి నూడుల్స్‌ ప్యాకెట్లు, ఆరు యాపిల్స్, ఆరు బిస్కట్లు, పాలు, వాటర్‌ బాటిళ్లను అందించనున్నట్లు ప్రకటించారు.

    చౌకగా కూరగాయలు అందించే ఏర్పాట్లను కూడా చేస్తామన్నారు. వరద బాధితులకు కూరగాయల ధరలను రూ.2, రూ.5, రూ.10కు అందిస్తామని, ఒక్కో ఇంటికి 25 కిలోల బియ్యం, లీటర్‌ పామాయిల్‌, కిలో పప్పుతో కిట్లు అందిస్తామని వెల్లడించారు.

    అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటామన్నారు. 20కి పైగా సెల్‌ఫోన్ టవర్ల పునరుద్ధరణపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకుంటామని చెప్పారు.

    వివరాలు 

    ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అండగా ఉంటుంది: శివరాజ్‌సింగ్ చౌహాన్

    కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అండగా ఉంటుందని చెప్పారు.

    ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, కేంద్రం అవసరమైన సహకారాన్ని అందిస్తుందన్నారు.

    ప్రాథమిక అంచనాల ప్రకారం,1.8లక్షలహెక్టార్లలో పంట దెబ్బతిందని.. 2లక్షల మంది రైతులు నష్టపోయారని ఆయన తెలిపారు.

    నిపుణుల బృందాలు వరద నష్టాన్ని అధ్యయనం చేస్తున్నాయి,పూర్తి అంచనా తీసుకున్న తర్వాత కేంద్రం తక్షణ,దీర్ఘకాలిక సాయం అందిస్తుందని చెప్పారు.

    రాష్ట్ర ప్రభుత్వ చర్యలు వేగంగా,సమర్థంగా ఉంటే ప్రాణనష్టం తగ్గుతుందని డ్రోన్ల ద్వారా పాలు, మంచినీళ్లు, ఆహారం అందజేయడం మొదటిసారిగా చూస్తున్నట్లు చెప్పారు.

    ప్రధాని, కేంద్ర హోమ మంత్రి పంపించిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు,వాయుసేన,నౌకాదళం హెలికాప్టర్లు కూడా సహాయం అందించాయన్నారు.

    కేంద్రం నుంచి వచ్చిన బృందం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    చంద్రబాబు నాయుడు

    Chandrababu Naidu: పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు  ఆంధ్రప్రదేశ్
    Chandrababu Naidu: ఏపీలో పింఛనుదారులకు శుభవార్త ..3నుండి 4వేలు పెంపు ఆంధ్రప్రదేశ్
    Days After Oath: చంద్రబాబు, రేవంత్ పెండింగ్ సమస్యలపై కీలక భేటీ  రేవంత్ రెడ్డి
    Chandrababu:నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. రేపు ప్రధాని,ఇతర మంత్రులతో  భేటీ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025