NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Metro Rail: విశాఖ, విజయవాడల్లో మెట్రో డబుల్‌ డెక్కర్‌.. సీఎం చంద్రబాబు సమీక్ష
    తదుపరి వార్తా కథనం
    Metro Rail: విశాఖ, విజయవాడల్లో మెట్రో డబుల్‌ డెక్కర్‌.. సీఎం చంద్రబాబు సమీక్ష
    విశాఖ, విజయవాడల్లో మెట్రో డబుల్‌ డెక్కర్‌.. సీఎం చంద్రబాబు సమీక్ష

    Metro Rail: విశాఖ, విజయవాడల్లో మెట్రో డబుల్‌ డెక్కర్‌.. సీఎం చంద్రబాబు సమీక్ష

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 03, 2025
    08:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టుల భాగంగా మొత్తం 23.70 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ అమలు చేయనున్నారు.

    విశాఖపట్నం నగరంలో మధురవాడ నుండి తాటిచెట్లపాలెం వరకు, అలాగే గాజువాక నుండి స్టీల్ ప్లాంట్ వరకు మొత్తం 19 కి.మీ. మేరకు, విజయవాడ నగరంలో రామవరప్పాడు రింగ్ నుండి నిడమానూరు వరకు 4.70 కి.మీ. మేరకు డబుల్ డెక్కర్ పద్ధతిలో మెట్రో నిర్మాణానికి కొత్త డిజైన్లు ప్రతిపాదించారు.

    ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆమోదించారు.

    ఈ సందర్భంగా అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ అందించారు.

    వివరాలు 

    నాలుగేళ్లలో మెట్రో సేవలు

    2017 మెట్రో రైల్ విధానం ప్రకారం విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మొత్తం 142.90 కి.మీ. మేరకు చేపట్టనున్న మెట్రో ప్రాజెక్టులకు 100 శాతం నిధులను కేంద్రం సమకూర్చేలా ప్రయత్నాలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

    కోల్‌కతాలో 16 కి.మీ. మేరకు చేపట్టిన మెట్రో ప్రాజెక్టుకు రూ. 8,565 కోట్ల నిధులను కేంద్రం సమకూర్చిన ఉదాహరణను అధికారులు సూచించారు.

    ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి మెట్రో రైల్ ప్రాజెక్టు నిధుల కోసం కేంద్రంతో చర్చలు జరపాలని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు.

    వీటిని నాలుగేళ్లలో పూర్తి చేసి మెట్రో సేవలు అందుబాటులోకి తేవాలని ఆయన సూచించారు.

    వివరాలు 

    మెట్రో సేవలు త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ లక్ష్యం

    డబుల్ డెక్కర్ మోడల్ గురించి వివరించి చూస్తే,ఈ మోడల్‌లో కింద రోడ్డు,దాని పై ఫ్లైఓవర్, మరి దాని పైన మెట్రో ట్రాక్ ఉంటుంది.

    రహదారిపై 10మీటర్ల ఎత్తులో ఫ్లైఓవర్,దానిపై 8మీటర్ల ఎత్తులో మెట్రో ట్రాక్ ఏర్పాటు చేస్తారు.

    దీనివల్ల ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తోడ్పడడమే కాకుండా రహదారుల గుండా మెట్రో సేవలు సాఫీగా నడిచేలా చేస్తుంది.

    ముఖ్యంగా జాతీయ రహదారుల మీదుగా ప్రయాణించే ప్రాంతాల్లో ఈ మోడల్ అమలు ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించనున్నారు.

    ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదించి కేంద్రానికి పంపింది.

    దీనికి సంబంధించిన కార్యక్రమాలను వేగంగా అమలు చేయాలని,రాష్ట్ర ప్రజలకు మెట్రో సేవలు త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    IND vs PAK: పాక్‌కు ఏడీబీ బ్యాంక్ $800 మిలియన్ల ప్యాకేజీ.. నిధుల విడుదలపై భారత్ అభ్యంతరం.. పాకిస్థాన్
    Narendra Modi: ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై తొలిసారి రైలు ప్రయాణం.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం నరేంద్ర మోదీ
    Hyderabad: హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ట్రావెల్‌ బ్యాగ్‌లో మహిళ మృతదేహం కలకలం హైదరాబాద్
    Motivational: అనుకున్నది సాధించాలంటే.. ముప్పయ్యేళ్ల లోపు మీకున్న ఈ చెడు అలవాట్లు వదిలేయండి ప్రేరణ

    ఆంధ్రప్రదేశ్

    Amaravati: అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదం  భారతదేశం
    Men group: ఏపీలో డ్వాక్రా సంఘాల మాదిరిగా పురుషుల గ్రూపుల ఏర్పాటు భారతదేశం
    Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు
    DAJGUA: ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌ కింద ఆంధ్రప్రదేశ్‌ నుంచి 878 గ్రామాలు ఎంపిక: దుర్గాదాస్‌ ఉయికే  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025