NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP CM Chandrababu: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీగా అమరావతి: చంద్రబాబు 
    తదుపరి వార్తా కథనం
    AP CM Chandrababu: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీగా అమరావతి: చంద్రబాబు 
    ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీగా అమరావతి

    AP CM Chandrababu: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీగా అమరావతి: చంద్రబాబు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 29, 2024
    06:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీగా మారుస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అధికారులను ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

    పురపాలక శాఖ మంత్రి నారాయణ,సీఆర్డీయే అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఈ అంశాన్ని చర్చించారు.

    అమరావతి లోగో డిజైన్ ఆంగ్లంలో మొదటి అక్షరం 'A', చివరి అక్షరం 'I' కలిసేలా, ఏఐ సిటీగా గుర్తింపు పొందేలా ఉండాలని కోరారు.

    రాజధాని నిర్మాణం ఎక్కడ చూసినా సాంకేతిక ప్రగతిని ప్రతిబింబించేలా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

    గత ప్రభుత్వం అమరావతి పట్ల వ్యవహరించిన తీరుతో రాజధాని పనులు నిలిచిపోయాయని, ఇప్పుడు వాటిని వేగంగా పునరుద్ధరించాలని చెప్పారు.

    వివరాలు 

    హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుపై సమీక్ష

    అధికారులకు టెండర్లు పిలవడం,ప్రభుత్వ భవనాల నిర్మాణానికి పట్టే సమయం,చేపట్టిన పనులను సమీక్షించారు.

    సీఆర్డీయే కార్యాలయం నిర్మాణం 90 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.అధునాతన టెక్నాలజీని ఉపయోగించి నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా నిర్మాణం జరగాలన్నారు.

    హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుపై కూడా సీఎం సమీక్షించారు.ఈప్రాజెక్టును 2019లో వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని,దీని వలన సీఆర్డీఏకు భారీ నష్టం వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.

    ఈ నష్టాన్ని పూడ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని,ప్రాజెక్టును పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు.

    రాజధానిలో ఇంకా 3,558ఎకరాలు సేకరించాల్సి ఉందని,రెండు గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

    అదేవిధంగా,రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు 60% పూర్తయ్యాయని,ఈ పనులను డ్రోన్ల సాయంతో పర్యవేక్షించాలన్నారు.

    విశాఖపట్టణం,విజయవాడల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని

    చంద్రబాబు నాయుడు

    Chandrababu Naidu : జూన్ 12న చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం  ఆంధ్రప్రదేశ్
    NDA Alliance: నేడు ఎన్డీయే సమావేశం.. కీలక అంశాలపై చర్చ..!  నరేంద్ర మోదీ
    Chandrababu Naidu:చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం.. ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపులు  భారతదేశం
    NDA meet : చంద్రబాబు పట్టాభిషేకానికి రంగం సిద్ధం.. తరలి రానున్న అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025