NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Government: ఉపాధి హామీ పథకం పనుల కోసం రూ.176.35 కోట్ల విడుదల..
    తదుపరి వార్తా కథనం
    AP Government: ఉపాధి హామీ పథకం పనుల కోసం రూ.176.35 కోట్ల విడుదల..
    ఉపాధి హామీ పథకం పనుల కోసం రూ.176.35 కోట్ల విడుదల..

    AP Government: ఉపాధి హామీ పథకం పనుల కోసం రూ.176.35 కోట్ల విడుదల..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 09, 2025
    05:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

    ఈ పథకం పనుల నిమిత్తంగా రూ.176.35 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.

    2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనుల కోసం ఉపయోగించనుంది.

    ఈ నిధులను నిర్ణీత నిబంధనల ప్రకారం ఖర్చుచేయాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్‌కు అధికారిక ఆదేశాలు జారీ చేశారు.

    ఈ విషయంపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు.

    వివరాలు 

    దినసరి వేతనంలో పెంపు 

    ఉపాధి హామీ పథకం ద్వారా శ్రమించే కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు కీలక చర్యలు చేపడుతున్నారు.

    ఇటీవల కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో నిర్వహించిన ఉపాధి శ్రామికుల ఆత్మీయ సమ్మేళనంలో,ఉపాధి కార్మికుల వేతనాన్ని పెంచుతున్నట్టు ప్రకటించారు.

    దీంతో ఇప్పటివరకు ఉన్న రోజువారి వేతనాన్ని రూ.307కి పెంచారు.

    కార్మికుల భద్రత విషయంలోనూ ప్రభుత్వం గణనీయమైన నిర్ణయం తీసుకుంది.

    ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కార్మికులు పనిస్థలంలో ప్రమాదవశాత్తు మరణించకున్నాలేదా శారీరక వికలాంగతకు గురైనా వారి కుటుంబాలకు బీమా పరిరక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

    ఇప్పటికే ఉన్న బీమా పరిధి రూ.50,000గా ఉన్నదాన్ని కూటమి ప్రభుత్వం రూ.4 లక్షల వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    AP Government: ఉపాధి హామీ పథకం పనుల కోసం రూ.176.35 కోట్ల విడుదల.. ఆంధ్రప్రదేశ్
    Indian Army: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌  ఆర్మీ
    Honeymoon Couple Missing: హనీమూన్‌కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ మృతదేహానికి పోస్టుమార్టం.. నివేదికలో సంచలన విషయాలు  మేఘాలయ
    #NewsBytesExplainer: 'అమరావతి వేశ్యల రాజధాని' వ్యాఖ్య కలకలం.. రాష్ట్రంలో భగ్గుమన్న నిరసనలు.. అసలేం జరిగింది? అమరావతి

    ఆంధ్రప్రదేశ్

    AP Metro Train:ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక ముందడుగు.. విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ భేటీ  భారతదేశం
    Minister Savita: వచ్చే నెలలో నేతన్నలకు ఆరోగ్య బీమా.. చేనేత,జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడి  భారతదేశం
    Andhra News: ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా.. మార్గదర్శకాలు విడుదల భారతదేశం
    Ponguru Narayana: రెవెన్యూ రికార్డుల అమలు,భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం: నారాయణ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025