NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / New tourism policy: కొత్త పర్యాటక విధానంపై మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    New tourism policy: కొత్త పర్యాటక విధానంపై మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం
    కొత్త పర్యాటక విధానంపై మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం

    New tourism policy: కొత్త పర్యాటక విధానంపై మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 11, 2024
    08:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పర్యాటకరంగంలో పెద్దమొత్తంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టింది.

    మంత్రివర్గం ఆమోదించిన ఈ విధానంపై మంగళవారం జీఓ విడుదలైంది.

    ఇందులో పారిశ్రామిక హోదాను కల్పించి, ఎంఎస్‌ఎంఈలకు అందించే రాయితీలను పర్యాటక రంగానికీ వర్తింపజేసారు.

    పీపీపీ విధానంలో తీరప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సందర్శనీయ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించి పెట్టుబడులను ఆహ్వానించారు.

    కొత్త విధానంలో స్టాంపు డ్యూటీ, భూముల బదిలీ సుంకాలపై పూర్తి మినహాయింపు, లీజు రిజిస్ట్రేషన్లపై స్టాంపు డ్యూటీ మినహాయింపు, భూముల బదలాయింపునకు రుసుముల నుంచి మినహాయింపు, పారిశ్రామిక విద్యుత్తు టారిఫ్ వర్తింపజేయడం వంటి ఇతర రాయితీలు పొందుపరచబడ్డాయి.

    వివరాలు 

    ఐదేళ్లపాటు విద్యుత్తు సుంకం మినహాయింపు

    ప్రాజెక్టు ప్రారంభం తర్వాత ఐదేళ్లపాటు విద్యుత్తు సుంకం మినహాయింపు, క్వాలిటీ సర్టిఫికేషన్‌కు జాతీయ స్థాయికి రూ.2 లక్షలు, అంతర్జాతీయ స్థాయికి రూ.10 లక్షల రాయితీ వర్తింపు వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

    రూ.51 కోట్లు పైగా పెట్టుబడులకు ఈ రాయితీలు వర్తించవు. అలాగే, జీఎస్‌టీపై గరిష్ఠంగా మూలధన పెట్టుబడికి సమానమైన మినహాయింపులు అందిస్తారు.

    భారీ, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టుల కోసం 7 నుంచి 15 ఏళ్లపాటు జీఎస్‌టీ మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తుందని పేర్కొంది.

    రూ. కోటి పెట్టుబడికి ఒక ఉపాధి నిష్పత్తి ఆధారంగా అదనపు ప్రోత్సాహకాలను కూడా ఇవ్వాలని ప్రస్తావించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

    US Visa: అమెరికాలో భారత విద్యార్థుల్లో దాదాపు సగంమంది తెలుగువారే! తెలంగాణ
    Polavaram: పోలవరం నిర్మాణంలో నిపుణుల హెచ్చరికలు.. సమగ్ర ప్రణాళికలు అవసరం పోలవరం
    TIDCO Houses: టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి నారాయణ శుభవార్త..! భారతదేశం
    AP SSC Exams: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025