NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bengaluru: భార్య వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్.. మగాళ్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన..
    తదుపరి వార్తా కథనం
    Bengaluru: భార్య వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్.. మగాళ్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన..
    భార్య వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్.. మగాళ్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన..

    Bengaluru: భార్య వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్.. మగాళ్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 10, 2024
    05:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరులో చోటుచేసుకున్న ఓ విచిత్రమైన సంఘటనలో 34 ఏళ్ల అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు.

    అతుల్, బిహార్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, బెంగళూరులో మంజునాథ్ లేఅవుట్‌లో నివాసముంటున్నాడు.

    అతని ఆత్మహత్య అనంతరం, బెంగళూరు పోలీసులు సూసైడ్ నోట్‌ని కనుగొన్నారు.

    ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

    నెటిజన్లు అతుల్‌కు న్యాయం చేయాలంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. అతుల్ చివరిలో వదిలిన వీడియోలు, నోట్ ఆయన ఎదుర్కొన్న తీవ్రమైన మానసిక వేధింపులను వెల్లడిస్తున్నాయి.

    ఆయన ఆత్మహత్యకు ముందు ''న్యాయం జరగాలి'' అనే ప్లకార్డు స్వాధీనం చేసుకున్నారు.

    వివరాలు 

    తప్పుడు కేసులతో న్యాయవ్యవస్థ వేధించడంపై రాష్ట్రపతికి లేఖ

    అతుల్ నుంచి విడిపోయిన భార్య, అతడి తల్లిదండ్రులపై తప్పుడు కేసు పెట్టిందని, దీంతో ఆయన మానసికంగా కుంగిపోయినట్లు సోదరుడు బికాస్ కుమార్ పోలీసులకు తెలిపారు.

    అతుల్ తన భార్య, ఉత్తర్ ప్రదేశ్ ఔన్‌పూర్ న్యాయమూర్తిపై కూడా వీడియోలో ఆరోపణలు చేశాడు.

    తప్పుడు కేసులతో న్యాయవ్యవస్థ వేధించడంపై ఆయన రాష్ట్రపతికి లేఖ రాశారు.

    మరో నోట్‌లో తన భార్య తనపై మోపిన అన్ని అభియోగాల్లో తాను నిర్దోషినని భార్య, అతడిపై వరకట్న నిషేధం, క్రూరత్వం వంటి కేసులు పెట్టిందని,ఈ తప్పుడు కేసుల్లో తన తల్లిదండ్రుల్ని, సోదరుడిని వేధించడం మానుకోవాలని కోర్టును కోరారు.

    2019లో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పెళ్లి చేసుకున్న తర్వాత, తన భార్య కుటుంబీకులు లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసేవారని అతుల్ ఆరోపించారు.

    వివరాలు 

     న్యాయమూర్తి రూ. 5లక్షలు డిమాండ్  

    డబ్బులు నిరాకరించడంతో 2021లో ఆమె బెంగళూరులో నుంచి పుట్టింటికి వెళ్లిపోవడం వంటి విషయాలు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.తరువాత,అతుల్‌పై తన భార్య,ఆమె కుటుంబం హత్య, అసహజ సెక్స్ వంటి అనేక తప్పుడు కేసులు పెట్టాయి.

    ఆయన,ఈ తప్పుడు కేసులను పరిష్కరించడంలో భార్య ,ఆమె కుటుంబం మొదట రూ. 1 కోటి, తర్వాత రూ.3కోట్లు డిమాండ్ చేశారని చెప్పారు.తన భార్య కోర్టులో నెలకు రూ.2లక్షలు డిమాండ్ చేసిందని చెప్పారు.

    కోర్టు విచారణ సందర్భంగా..తప్పుడు కేసులతో మగాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జడ్జికి చెప్పగా,తన భార్య'మీరేందుకు చేసుకోరు'అని చెప్పిందని,దీనికి జడ్జ్ నవ్వుతూ ఆమెని రూం నుంచి బయటకు వెళ్లమని చెప్పాడని,తన కుటుంబం గురించి ఆలోచించాలని న్యాయమూర్తి చెప్పాడని, కేసుని పరిష్కరించుకోవడానికి రూ. 5లక్షలు డిమాండ్ చేశాడని అతుల్ ఆరోపించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బెంగళూరు

    Bangalore: బెంగళూరులో దారుణం.. హాస్టల్‌లోకి వెళ్లి మహిళ గొంతు కొసిన నిందితుడు ఇండియా
    బెంగళూరు హాస్టల్‌లో మహిళ హత్య.. మధ్యప్రదేశ్‌లో నిందితుడు అరెస్టు మధ్యప్రదేశ్
    Dog Meat : బెంగళూరు హోటళ్లలో కుక్క మాంసం..? 90 డబ్బాలు పట్టివేత! ఇండియా
    Newly weds Died: విషాదం..పెళ్లయిన గంటల్లోనే నవదంపతుల మృతి కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025