Chandrababu: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట.. ఒకేసారి 3 కేసులలో ముందస్తు బెయిల్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఐఆర్ఆర్, ఇసుక, మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్ లభించింది. ఒకేసారి 3 కేసులలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయితే ఈ కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను పరిశీలించిన ఏపీ హైకోర్టు పలుమార్లు విచారించి తీర్పును రిజర్వ్ చేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు. అమరావతి ఔటర్ రింగ్ మాస్టర్ ప్లాన్ అలైన్మెంట్లో పార్టీ నాయకులకు అనుకూలంగా అలైన్మెంట్ చేశారని మద్యం టెండర్లలలో, ఉచిత ఇసుక వ్యవహారంలోనూ అక్రమాలకు పాల్పడారని సీఐడీ కేసులు నమోదు చేసింది.