NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ap Government : ఆంధ్రప్రదేశ్ సర్కారుకు హైకోర్టు షాక్.. విశాఖకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో
    తదుపరి వార్తా కథనం
    Ap Government : ఆంధ్రప్రదేశ్ సర్కారుకు హైకోర్టు షాక్.. విశాఖకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో
    విశాఖకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో

    Ap Government : ఆంధ్రప్రదేశ్ సర్కారుకు హైకోర్టు షాక్.. విశాఖకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 21, 2023
    04:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖకు ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలను తరలించాలనుకున్న ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది.

    ఈ మేరకు కార్యాలయాల తరలింపు ప్రక్రియకు కోర్టు బ్రేకులు వేసింది. ఈ క్రమంలోనే కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదలాయిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

    త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంత వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధిస్తూ ఆదేశాలిచ్చింది.

    అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపును సవాల్ చేస్తూ రైతులు వేసిన పిటీషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.

    DETAILS

    కేసు త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ

    ఈ పిటీషన్‌ను ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి పంపిస్తామని ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.

    ఇప్పటికే విచారణ పెండింగ్‌లో ఉందని, ఈలోగా పిటీషన్ వేసిన రైతుల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది.

    ఈ సందర్భంగానే రాజధాని కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

    దీంతో తాము ప్రభుత్వం నుంచి ఆదేశాలు విడుదల చేయిస్తామని ప్రభుత్వ న్యాయవాది బదులిచ్చారు. దీంతో. తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.

    ఈ మేరకు ఇవాళ మరోసారి విచారణ జరిపిన హైకోర్టు, కేసు త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది.

    సదరు ధర్మాసనం తీర్పు వచ్చే వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో ఉత్తర్వులను రిలీజ్ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం
    హైకోర్టు

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    విశాఖపట్టణం

    కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ

    హైకోర్టు

    టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 రద్దుపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు టీఎస్పీఎస్సీ
    లోకేశ్ కు ముందస్తు బెయిల్ మంజూరు.. ఫైబర్ గ్రిడ్ కేసు విచారణ వాయిదా నారా లోకేశ్
    ఈడీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని సూచన  సుప్రీంకోర్టు
    నేను జారీ చేసిన ఉత్తర్వులతో కేంద్రం ఎందుకు ఇబ్బంది పడిందో అర్థం కాలేదు: జస్టిస్ మురళీధర్  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025