NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Liquor Bar Auctions : ఏపీలో 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ 
    తదుపరి వార్తా కథనం
    AP Liquor Bar Auctions : ఏపీలో 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ 
    ఏపీలో 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ

    AP Liquor Bar Auctions : ఏపీలో 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 17, 2024
    04:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ మద్యం పాలసీ అమల్లో ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ తాజాగా 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల చేసింది.

    దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 17 నుంచి ప్రారంభమై ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది.

    అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ దరఖాస్తులను డిసెంబర్ 23న పరిశీలించి, డిసెంబర్ 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేలం నిర్వహిస్తారు.

    వేలం ప్రక్రియలో విజయం సాధించిన వారికి ఎక్సైజ్ అధికారులు లైసెన్సులు జారీ చేస్తారు.

    వివరాలు 

    53 బార్లకు వేలం ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల 

    గతంలో ఒకసారి 53 బార్లకు వేలం ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల చేశారు, కానీ ప్రభుత్వం ఆ ప్రక్రియను రద్దు చేసి తాజాగా రీనోటిఫికేషన్ విడుదల చేసింది.

    ఈ బార్లకు లైసెన్స్ గడువు 2025 ఆగస్టు వరకు కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.

    గత పాలసీ ప్రకారం, దరఖాస్తు ఫీజులు జనాభాపై ఆధారపడి ఉంటాయి. 50,000 జనాభా వరకు ఉన్న ప్రాంతాల్లో దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలు, 50,000 నుంచి 5 లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.7.5 లక్షలు కాగా, 5 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.10 లక్షలుగా నిర్ణయించారు.

    ఈ ఫీజు నాన్ రిఫండబుల్.

    వివరాలు 

    ఐదేళ్లకు ఒకేసారి లైసెన్సులు జారీ

    అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రీమియం లిక్కర్ స్టోర్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వబడింది. ఎక్సైజ్ శాఖ ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, మొత్తం 12 ప్రీమియం స్టోర్లను మున్సిపల్ కార్పొరేషన్లు, ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నారు.

    ఈ స్టోర్ల దరఖాస్తు ఫీజు రూ.15 లక్షలుగా నిర్ణయించబడింది. లైసెన్స్ ఫీజు ఏడాదికి రూ.కోటి కాగా, ప్రతి ఏడాది 10 శాతం చొప్పున ఈ ఫీజు పెరుగుతుంది.

    ఐదేళ్లకు ఒకేసారి లైసెన్సులు జారీ చేస్తారు. ప్రీమియం స్టోర్లకు దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు.

    ఈ చర్యలతో నాణ్యమైన లిక్కర్ అందుబాటులోకి రావడంతో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

    అలాగే ప్రభుత్వ ఆదాయం పెరగడంతోపాటు కొత్త బార్ల, ప్రీమియం స్టోర్ల ఏర్పాటుతో మద్యం వ్యాపారంలో మరింత పారదర్శకత తీసుకురానున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఆంధ్రప్రదేశ్

    AP Sachivalayalu: ఏపీలో గ్రామ-వార్డు సచివాలయాల పునర్నిర్మాణం.. సేవల మెరుగుదలపై దృష్టి సచివాలయం
    AP Rajyasabha ‍Elections: ఆంధ్రప్రదేశ్‌‌లో రాజ్యసభ ఎన్నికలు.. పోటీ నుండి తప్పుకున్న నాగబాబు  రాజ్యసభ
    Tourism: చలికాలంలో ఆంధ్రప్రదేశ్‍లో మంచు కురిసే ఈ ప్రాంతానికి ఎలా వెళ్లాలంటే.. పర్యాటకం
    Andhrpradesh: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025