NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Tourism Investments: రూ.1217 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులతో ఏపీ టూరిజం ఒప్పందాలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP Tourism Investments: రూ.1217 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులతో ఏపీ టూరిజం ఒప్పందాలు 
    రూ.1217 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులతో ఏపీ టూరిజం ఒప్పందాలు

    AP Tourism Investments: రూ.1217 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులతో ఏపీ టూరిజం ఒప్పందాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 28, 2025
    06:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీ పర్యాటక రంగాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో మరింత వేగాన్ని కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నది.

    పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విజయం సాధిస్తోంది.

    రూ.1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల పై ఎంవోయూలపై సంతకాలు చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

    విశాఖపట్టణం, తిరుపతి, అమరావతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 825 రూమ్ల వసతులను ఏర్పాటు చేయడానికి ఇన్వెస్టర్లు ముందుకొచ్చారని చెప్పారు.

    దీంతో, పర్యాటక రంగంలో 2,567 కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో అరకు చలి ఫెస్టివల్ బ్రోచర్ కూడా విడుదల చేశారు.

    వివరాలు 

    పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా 

    "ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడం మా ప్రధాన లక్ష్యంగా విశాఖ ప్రాంతీయ పర్యాటక సదస్సు నిర్వహించాం. త్వరలోనే విశాఖ కేంద్రంగా క్రూయిజ్ హబ్ ఏర్పాటవుతుంది. విశాఖపట్టణం ఎంటర్టైన్మెంట్, పర్యాటక రంగంలో రియల్ హబ్ గా మారిపోతుంది. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చాం. ఈ సమయంలోనే పెట్టుబడులు పెట్టేందుకు ఉత్తమమైనది"- మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

    వివరాలు 

    8 సంస్థలతో ఒప్పందం - రూ.1217 కోట్ల పెట్టుబడులు 

    అట్మాస్పియర్ కోర్ - విశాఖ, అమరావతి, తిరుపతి - రూ.1,000 కోట్లు

    సుమియాగ్రి - విశాఖ, గుంటూరు - రూ.50 కోట్లు

    ఎవరెస్టు ఎంటర్ ప్రైజెస్ - విశాఖ - రూ.7 కోట్లు

    రాయల్ పామ్స్ - చీరాల - రూ.30 కోట్లు

    రిప్పిల్స్ అండ్ కో - అల్లూరి సీతారామరాజు జిల్లా - రూ.100 కోట్లు

    బ్లూబే ఇన్ ఫ్రా - భోగాపురం - రూ.18 కోట్లు

    హోటల్ ఎస్ పార్క్ - బాపట్ల - రూ.7 కోట్లు

    డాల్ఫిన్ ఓషన్ క్రూయిజ్ - విశాఖ - రూ.5 కోట్లు

    విశాఖలో జరిగిన ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సమ్మిట్‌లో 150 మంది పెట్టుబడిదారులు పాల్గొన్నారు.

    వివరాలు 

    రిప్పిల్ అండ్ కో రూ.100 కోట్లు పెట్టుబడులు

    ఈ సమ్మిట్ లో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, యారాడ బీచ్‌లో హోటల్స్, రిసార్ట్స్ ప్రాజెక్టు కోసం అట్మాస్పియర్ కోర్ రూ.500 కోట్ల పెట్టుబడులను పెట్టనుందని తెలిపారు.

    విశాఖపట్టణం, అమరావతిలోని హోటళ్లకు సుమియాగ్రి రూ.50 కోట్లు, విల్లాలు, కన్వెన్షన్ సెంటర్ కోసం రిప్పిల్ అండ్ కో రూ.100 కోట్లు పెట్టుబడులు పెట్టనట్లు ప్రకటించారు.

    ఏపీ ప్రభుత్వం కొత్త పర్యాటక విధానం ద్వారా జీఎస్‌టి,విద్యుత్, మున్సిపల్ కార్పొరేషన్ ఛార్జీల్లో సంస్కరణలు తీసుకోనుంది అని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు.

    పరిశ్రమ రంగం,పర్యాటక రంగాన్ని సమకాలికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

    ప్రకృతి సౌందర్యం,పర్యావరణ అనుకూలతకు ప్రసిద్ధి చెందిన ఉత్తరాంధ్ర, ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని మంత్రులు తెలిపారు.

    వివరాలు 

    క్రూయిజ్ టూరిజం 

    క్రూయిజ్ టూరిజం త్వరలోనే ప్రారంభమవుతుందని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు.

    పుదుచ్చేరి ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో చర్చించిన అనంతరం ఈ సదుపాయం తిరిగి ప్రారంభమవుతుందని వెల్లడించారు.

    అడ్వెంచర్ టూరిజంతో పాటు పిలిగ్రమ్ టూరిజం కూడా త్వరలో ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు.

    రాత్రిపూట హోటల్స్ / ఫుడ్ స్టాల్స్ కార్యకలాపాలను అనుమతించే ప్రణాళికలను ప్రకటించారు.

    పెట్టుబడిదారులు తమ ప్రతిపాదనలను సమర్పిస్తే వాటిని త్వరగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

    స్టార్ హోటళ్లకు మద్యం బార్ లైసెన్స్ ఫీజును రూ.66 లక్షల నుంచి రూ.20 లక్షలకు తగ్గించాలనే సిఫార్సు సీఎం చంద్రబాబుకు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

    వివరాలు 

    20 లక్షల ఉద్యోగావకాశాలు 

    పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ, పర్యాటక రంగంలో అనేక కీలక పరిణామాలను వివరించారు.

    విజయవాడలో తొలి ఇన్వెస్టర్ సమ్మిట్‌ను నిర్వహించినట్లు పేర్కొన్నారు.

    ప్రస్తుతం తిరుపతిలో మూడో ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించేందుకు ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.

    వచ్చే ఐదేళ్లలో పర్యాటక రంగంలో 20 లక్షల ఉద్యోగావకాశాలు సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

    CM Chandrababu:చంద్రబాబు కీలక ప్రకటన.. గ్రీన్‌ ఎనర్జీలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు  చంద్రబాబు నాయుడు
    APSRTC: సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రయాణికులకు శుభవార్త సంక్రాంతి
    Cock Fights: పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పశ్చిమ గోదావరి జిల్లా
    Chandrababu: ప్రతి ఇంట్లో పండుగ శోభ చేర్చడమే లక్ష్యం.. పీ-4 విధానానికి చంద్రబాబు పిలుపు చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025